జిల్లా ఎస్పీ యూ.రవి ప్రకాష్ ఆదేశాల మేరకు పెనుగొండ లో రాత్రి పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లలో జరుగుతున్న దొంగతనాల కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని పెనుగొండ పోలీసులు అరెస్టు చేసారు. నరసాపురం ఇంఛార్జి sdop జీ.వీ.ఎస్ పైడేశ్వరరావు పెనుగొండ పోలీసు స్టేషన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెనుగొండ గ్రామంలోని చెరుకువాడకు చెందిన కోసూరి కరుణ (33సం) జల్సాలకు అలవాటు పడి రాత్రి పూట తాళాలు వేసిన ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బంగారం, మరియు వెండి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అంతే కాకుండా బైక్ లు దొంగతనాలకు కూడా పాల్పడేవాడని దొంగిలించిన వెండి, బంగారం వస్తువులను ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి తన అవసరాలకు ఉపయోగించుకునేవాడని తెలిపారు. పెనుగొండ ఇన్స్పెక్టర్ మరియు ఆయన సిబ్బందితో మరియు మధ్య వర్తులతో తేదీ.08-12-2013 తేదీన చెరుకువాడలో ముద్దాయి ఇంటి వద్ద సుమారు 5 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని విచారించగా తన నేరచరిత్ర అంతా బయటపడింది. పట్టుబడిన కోసూరి కరుణ గత ఎనిమిది నెలల నుండి పాలకొల్లు మరియు పలు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది .అతని నుంచి సుమారు 12.5 కాసుల బంగారం, ఒక కేజి వెండి ఒక మోటార్ సైకిల్ రూ. 8,00,000 లక్షల విలువగల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలందరూ మోటార్ సైకిళ్ళుకు జీపీఎస్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ఇళ్లల్లో ఉన్న బంగారం మరియు నగదును వీలైనంత మేర బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Police
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఫైనాన్స్ కంపెనీల్లో దొంగతనాలకు ప్రయత్నిస్తున్న ఓ దుండగుడును పట్టుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామని సిసిఎస్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు చేరుకుని దర్యాప్తు చేపట్టిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ సిసిఎస్ సిబ్బందితో సంఘటనా స్థలాలకు చేరుకుని సంఘటనలు జరిగిన తీరును పరిశీలించారు. ఐదో తారీకు అర్ధరాత్రి ముత్తూట్ ఫైనాన్స్ చోరీకి ప్రయత్నించిన దుండగుడు, ఎనిమిదో తారీకు అర్ధరాత్రి ఫైనాన్స్ కంపెనీలో చోరీకి ప్రయత్నించిన దుండగుడు, రెండు చోట్ల చోరీకి ప్రయత్నించిన వ్యక్తి మంకీ క్యాప్ ధరించి ఉన్నట్లు సిసి ఫుటేజ్ ల ద్వారా పరిశీలిస్తున్న పోలీసులు, రెండు ఫైనాన్స్ కంపెనీల వద్ద స్థానిక పోలీసులతో కలిసి వివరాలు సేకరిస్తున్న ఏలూరు సిసిఎస్ పోలీసులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో అన్ని లాడ్జిలలో చెక్ చేస్తున్న నూజివీడు పట్టణ పోలీసులు, రెండు నేరాలలో ఒకే వ్యక్తి పాల్గొన్నట్టు నిర్ధారణకు వచ్చిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్.వి. మురళి కృష్ణ టెక్నికల్ ఆధారాలు సేకరించి దర్యాప్తు వేగవంతం చేసి ముద్దాయిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్యాంకుల వద్ద, ఫైనాన్స్ కంపెనీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ నియమించుకోవాలని, నష్టం జరిగాక ఇబ్బంది పడే దానికన్నా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్.వి.మురళీకృష్ణ సూచించారు.
Read Also…
Read Also….
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్ కొడకంచి శివారు ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ప్రాంతాన్ని ఎస్ ఓ టి పోలీసులు. గుర్తించారు గత 6నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఆల్ఫా జోలం, హేరైన్, కోకైన్, పలు రకాల డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం. దీంతో ఎస్ ఓ టి పోలీసులు అక్రమంగా డ్రగ్స్ తయారుచేస్తున్న ప్రాంతంపై నిఘా పెట్టారు.అదునుచూసుకున్న పోలీసులు డ్రగ్ తయారీ కేంద్రంపై చాకచక్యంగా వ్యవహరించి 14 కిలోల ఆల్ప్రా జోలం ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ బిఆర్ఎస్ జిల్లా నేత కనుసన్నల్లో ఈ డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్ తయారి కేంద్రం వద్ద ఐదుగురు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహ్మద్ యూనస్ ఆలియాస్ జక్కరాజు, బోరపట్ల,శ్రీనివాస్ గౌడ్,గ్రామం గుండ్ల,మ్యాచునుర్, నిర్మల్ గౌడ్, గ్రామం కొడకంచి, మణిక్యల రావు, గ్రామం ఇస్సాపూర్
శివశంకర్ గౌడ్, గ్రామం కొడకంచిరాహుల్ రెడ్డి, గ్రామం బిరంగుడ , శ్రీశైలం యాదవ్, గ్రామం గుండ్లమాచునుర్ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎస్ పి చెన్నూరు రూపెష్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ ఈ ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. రేవంత్రెడ్డి వారికి స్వాగతం పలికారు. వీరికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా రేవంత్ స్వయంగా పలువురు అగ్రనేతలను ఆహ్వానించారు. పక్క రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లాస్ వెగాస్లో ఓ దుండగుడు జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని, స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని స్థానిక పోలీసులు వెల్లడించారు. బుధవారం లాస్ వెగాస్ యూనివర్సిటీలో ఈ కాల్పులు జరిగాయని చెప్పారు. కాగా కాల్పులకు తెగబడ్డ అనుమానితుడు కూడా చనిపోయినట్టు ప్రకటించారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి గోడ కూలి భార్యాభర్తలు మృతి చెందారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ కూలింది. ఇంట్లో నిద్రిస్తున్న నూకతోటి పుల్లారావు, లక్ష్మీల పై పడింది. గోడ కూలిన శబ్దం విన్న స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే భార్యాభర్తలు మృతి చెందారు. జరిగిన ఘటన పై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ రెడ్డి రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హస్తవాసిని మార్చి, అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అందరి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో రేవంత్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దీనావస్థకు చేరింది. నాయకత్వ లేమి పార్టీకి ఇబ్బందిగా మారింది. 2014, 18 ఎన్నికల్లో చతికిలపడింది. ఈ కష్టకాలంలో రేవంత్ ఎంట్రీ ఆ పార్టీకి ఊపు తెచ్చిందనే చెప్పాలి. ఇటు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న అధిష్టానం ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంది. సీనియర్ నేతల ఏకతాడిపైకి రావడం, రేవంత్ మాస్ లీడర్ షిప్ గెలుపు తీరాలకు చేర్చి కాంగ్రెస్ పదేశ్ల నిరీక్షణకు తెరదించారు. ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎం, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించి సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సి.ఎస్ కోరారు. ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక వద్ద ఉంచాలి. వేదికను శుభ్రపరచడం, త్రాగు నీరు ఫాగింగ్ చేయడం వంటివి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. L.B. స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. అదే విధంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులకు ఆదేశించారు.
Read Also..
Read Also..
సిరివెళ్ల మండలం వంకిందిన్నే గ్రామానికి చెందిన కొకల ప్రసాద్ నంద్యాలలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. తెల్లవారుజామున సెక్యూరిటీ, వైద్య సిబ్బంది ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు కోకల ప్రసాద్. కొద్దిసేపు వార్డులన్నీ నిశితంగా పరిశీలించాడు. అనంతరం స్ర్తీల మెడికల్ వార్డులోకి ప్రవేశించి తాను వైద్యుడనని. రోగులకు పరీక్షలు చేయాలని అటెండర్స్ ను బయటికు పంపించాడు. తర్వాత పేషంట్ల కేసు షీట్లను. తీసుకొని రోగుల వద్దకు వెళ్లాడు. వైద్య పరీక్షలు చేస్తున్నట్లు నటిస్తూ, మహిళా రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదేమిటిని ప్రశ్నించిన ఓ రోగి భర్తపై ఆగ్రహంతో బయటకి పంపించేశాడు ఫేక్ డాక్టర్ ప్రసాద్. అనుమానించిన వైద్య సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని నిలదీశారు. కానీ తాను డాక్టర్ నని బుకాయించాడు ప్రసాద్. దీంతో ఆస్పత్రి సిబ్బంది అంతా కలిసి అతన్ని చితకవాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. 4రోజుల జైలు శిక్ష విధించారు మెజిస్ట్రేట్ రాంభూపాల్ రెడ్డి. వెంటనే అతన్ని పోలీసులు నంద్యాల సబ్ జైలుకు పంపించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చరిష్మా సూపర్ మార్కెట్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని విస్తృతంగా అలముకోవడంతో నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నుండి మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చ్చేశారు. అగ్నిప్రమాదంలో సుమారు 3 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరు నాగేశ్వరరావు వెల్లడించారు. చరిష్మా సూపర్ మార్కెట్ మొత్తం 5 బ్రాంచ్ లు ఉన్న క్రమంలో నరసరావుపేట మెయిన్ బ్రాంచ్ అని తెలిపారు. అగ్నిప్రమాదం సంభవించిందని తమకు సమాచారం అందిన వెంటనే సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మంటలు నిలుపుదల చేసేందుకు పూర్తి స్థాయిలో తగిన చర్యలు తీసుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చామని అగ్నిమాపక అధికారి ఎంవి సుబ్బారావు తెలియచేసారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో మ్యాజిక్ మార్క్ 60 సీట్లు కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 61 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఫలితాల ట్రెండ్ తో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. ఆయన నివాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు సెక్యూరిటీ పెంచారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పైనా రేవంత్ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు చోట్లా రేవంత్ రెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద శనివారం నుంచే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్థుల హవా కొనసాగడంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అనుచరులు బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు భద్రత మరింత పెంచారు.
Read Also..
Read Also..