పెద్దపెల్లి కేంద్రంలో స్థానిక రంగంపల్లి వద్ద రుచి గ్రాండ్ హోటల్ ఈ రోజు తెల్లవారుజామున సుమారు మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దాసరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిపై కత్తితో హత్యాయత్నం దాడి జరిగింది. ఈ సంఘటనతో పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఒక్కసారి కలకాలం రేపుతుంది ప్రేమ్ కుమార్ గోదావరి ఖని ప్రాంతానికి చెందినవాడిగా తెలుస్తుంది. ఈ సంఘటన తెలిసిన వెంటనే 108 కి సంబంధించిన సమాచారం అందడంతో సంఘటన చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న బాధితులని పోలీసుల సహకారంతో హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలవాలి తెలియాల్సి ఉందన్ని పోలీసులు తెలిపారు.
Tag:
Prem Kumar
తెలంగాణలో మార్పు అవసరమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆమె కూకట్పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబందు స్కీమ్లో అవినీతి జరుగుతోందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తమ మిత్రపక్ష జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రేమ్ కుమార్ని గెలిపించాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి కూడా మద్దతు ఉంటుందని వెల్లడించారు.లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో చేసిందేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం నాలుగు కోట్ల ఇళ్లను మంజూరు చేసి, మూడు కోట్ల ఇళ్లు నిర్మించిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఉన్నాయన్నారు.





Total views : 79210