బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి కి నిరసనగా కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నాలతో ఆర్డీవో కు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల హామీలలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎల్ ఆర్ ఎస్ ని పూర్తిగా పైసా ఖర్చు లేకుండా రద్దు చేస్తామని బూటకపు వాగ్దానంతో ప్రజలను మభ్య పెట్టి ఈ రోజు అధికారంలో రాగానే సామాన్య ప్రజలను నడ్డి విరిచే విధంగా ఎల్ ఆర్ ఎస్ పైన సుమారు 20 వేల కోట్ల రూపాయల వసూలు చేసే విధంగా ఉండడానికి తప్పు పట్టి ఈనాడు ప్రజల పక్షాన ప్రజల తరఫునుండి బిఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైందని గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ ఆర్ ఎస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
RDO office
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రం ఆర్డీవో కార్యాలయం ముందు ట్రిబుల్ ఆర్ భూ బాధితులు తమకు న్యాయం జరగాలని ధర్నా నిర్వహించారు. మొదటి అలైన్మెంట్ ప్రకారమే ట్రిబుల్ ఆర్ నిర్మాణం జరపాలని, రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల, బాగు కోసం గత ప్రభుత్వం త్రీబుల్ ఆర్ నిర్మాణం అలైన్మెంట్ మార్చారని దీని ద్వారా చిన్న సన్నకారు రైతులు భూములు కోల్పోతున్నారని మరియు చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇండ్లు కోల్పోతున్నారని తమకు న్యాయం చేయాలని చౌటుప్పల్, వలిగొండ మండలాల రైతులు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మొదటి అలైన్మెంట్ ప్రకారం సన్న, చిన్న రైతుల భూములు కోల్పోలేదని కొందరు రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల బాగు కోసం అలైన్మెంట్ మార్చడంతో చిన్న, సన్న కారు రైతుల పోవడంతో పాటు కొంతమంది ఇండ్లు కూడా కోల్పోతున్నారు. ఇందులో భాగంగా మందొలగూడెం గ్రామ రైతు మామిడి నర్సిరెడ్డి తన 8 ఎకరాల భూమిలో సుమారు ఆరు ఏకరాల భూమిని త్రిబుల్ ఆర్ రోడ్ విస్తరణ కోల్పోతుందని బాధపడుతూ రెండు ఏకరాలలో వ్యవసాయం ఎలా చేయాలని దిగులుతో వారం రోజుల క్రితం మరణించాడు. కావున మొదటి అలైన్మెంట్ ప్రకారమే నిర్మాణం చేపట్టాలని ఆర్డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందించామని రైతులు తెలుపుతున్నారు.






Total views : 78647