కాంగ్రెస్శాసన సభాపక్ష నేత రేవంత్రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేతోపాటు వీవీఐపీలు పలువురు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన బందోబస్తు చేస్తున్నారు. దీని కోసం మూడు వేల మందికి పైగా బలగాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే స్టేడియం లోపల, బయట మెటల్డిటెక్టర్లు, పోలీసు జాగిలాలతో తనిఖీలు పూర్తి చేశారు. నేడు మరోసారి తనిఖీలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ఆంక్షలు విధించారు. ఇక, బుధవారం ఇన్ఛార్జ్డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్పోలీస్కమిషనర్సందీప్శాండిల్య, సెంట్రల్జోన్డీసీపీ శ్రీనివాస్తదితరులు స్టేడియాంకు వచ్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
revanth reddy on telangana polls
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశం అవుతుంది. అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్కు తెలియజేస్తారు. అయితే, పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం.. పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు సీఎం రేసులో ఉన్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ తర్వాతనే సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేస్తారని తెలుస్తోంది. నిజానికి గత రాత్రే సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.
సీఎల్పీ తీర్మానాన్ని అధిష్ఠానానికి పంపి.. అక్కడి నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి అనంతరం గవర్నర్కు తెలియజేస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను నేడు గవర్నర్కు ఈసీ అందిస్తుంది. ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసిన అనంతరం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం ఉంది.