ప్రముఖ వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పెట్టిన కేసుపై సిఐడి విచారణ. గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్న అధికారులు. రామ్ గోపాల్ వర్మ పెట్టిన (క్రైమ్ నంబర్ 22/2023) కేసులో A6 గా ఉన్న రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ కు 17వ తేదీన అర్ధరాత్రి సమయంలో గుంటూరులో సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేసారు. A5 గా ఉన్న తిరువూరుకు చెందిన బండి శివకేశవ తో పాటు షేక్ ఫిరోజ్ ను ఈ నెల 19న ఉదయం గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి హాజరు కావాలని నోటిసులలో పేర్కొన్నారు. హాజరు కానీ పక్షములో అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Tag:
RGV
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 28న విచారణ చేపడతామని తెలిపింది. సినిమా విడుదల చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. వ్యూహం ట్రైలర్ విడుదల సమయంలో దర్శకుడు తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నచ్చరని చెప్పారని లోకేశ్ పిటిషన్ లో పేర్కొన్నారు. సీఎం జగన్ తెర వెనుక ఉండి ఈ సినిమా తీయించారన్నారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటి, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు.





Total views : 78869