రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఉక్రెయిన్ సైన్యం ఇప్పుడు రష్యా భూభాగంలోకి చొరబడింది. దాదాపు వెయ్యి మందికిపైగా ప్రత్యేక బలగాలతో కూడిన ఉక్రెయిన్ సైనిక యూనిట్… రష్యా సరిహద్దులు దాటి 30 కిలోమీటర్ల మేర లోపలికి చొచ్చుకు వెళ్లింది. ఈశాన్య ఉక్రెయిన్లోని సుమీ ఒబ్లాస్ట్ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ సైనిక యూనిట్.. రష్యాలోని కుర్స్క్ ఒబ్లాస్ట్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతం పరిధిలోని స్వెర్ ద్లికోవో, సుద్జా, మలయా, ల్యుంబీ మోవ్కా నగరాలలో ఉక్రెయిన్ ఆర్మీ పాగా వేసింది. ఈ విషయాన్ని రష్యా ఆర్మీ కూడా ధ్రువీకరించింది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కొత్త మలుపు. ఉక్రెయిన్ ఆర్మీ చర్యలపై స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఘాటుగా స్పందించారు. దీనికి తగిన సమాధానం ఇస్తామని ప్రకటించారు. ఈనేపథ్యంలో పెద్దఎత్తున యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్లు, సైనిక ట్రక్కులతో ఆయా నగరాలను రష్యా ఆర్మీ చుట్టుముట్టింది. అక్కడి నుంచి ఉక్రెయిన్ సైన్యాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ విజయానికి పునాది వారి పేస్ బౌలర్లు వేశారు. ముందుగా భారత జట్టును కేవలం 233 పరుగులకే ఆలౌట్ చేశారు.…
- నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి,…
- అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై నమోదైన కేసులను పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని న్యాయస్థానం తన…
- పీపీపీతోనే వేగంగా అభివృద్ధి.. ‘వీజీఎఫ్ విప్లవం ఖాయం.రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానమే కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పీపీపీ ప్రాజెక్టులు, ప్రభుత్వ వ్యయంపై అధికారులతో సమీక్షించిన సీఎం… త్వరలోనే ‘ఏపీ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0’ను తీసుకురావాలని ఆదేశించారు. ఏపీ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు…
- కరీంనగర్ జిల్లా ఘన్ముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి.ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్లు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ ఉన్నత…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 212470