తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమకు అవకాశం కల్పించిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. రాజీనామా చేసిన కార్పొరేషన్ల చైర్మన్లు డా. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రవీందర్ సింగ్, డా.వాసుదేవ రెడ్డి, మన్నే క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్ గౌడ్, పాటిమీద జగన్ మోహన్ రావు, అనిల్ కూర్మాచలం, గజ్జెల నగేష్, మేడె రాజీవ్ సాగర్, డా.ఆంజనేయులు గౌడ్, సతీష్ రెడ్డి, రామచంద్ర నాయక్, గూడూరి ప్రవీణ్, వాల్యా నాయక్ తదితరులు ఉన్నారు.
Tag:
Satish Reddy
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి ముందుకు సాగుతున్నాయి. జనసేనకు బీజేపీ ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా ప్రస్తుతానికి ఎనిమిది స్థానాలను బీజేపీ కేటాయించింది. మరికొన్ని స్థానాలపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. కూకట్పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు నుండి నేమూరి శంకర్ గౌడ్, కోదాడ నుండి మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు నుండి వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుండి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం నుండి లక్కినేని సురేందర్ రావు, వైరా నుండి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట నుండి ముయబోయిన ఉమాదేవి పోటీ చేయనున్నారు.





Total views : 79368