శ్రీకాకుళం నగర శివార్లలోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. విద్యార్థులకు భద్రత కల్పించాల్సిన పాఠశాల నిబంధనలను విస్మరిస్తోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం స్కూల్ బస్సులు హైవేపై రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నాయని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశముందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఉల్లంఘనలు జరుగుతున్నా, అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.ఇక ఈ పాఠశాలకు సరైన ప్రభుత్వ అనుమతులు లేవన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా అడ్మిషన్లు తీసుకుంటున్నారని తల్లిదండ్రులు అంటున్నారు..జిల్లా విద్యాశాఖ, రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించి స్కూల్పై విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
School
పుంగనూరు, బీడీ కాలనీ వద్ద ఆటోను ఢీకొన్న స్కూల్ బస్. ఆటోలో కూలీ పనులకు వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులు పెద్దపంజాని(మం)భద్రాచలం కు చెందిన వారిగా గుర్తింపు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలింపు. స్కూల్ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది అని పోలీసులు వెల్లడించారు.
అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలం లంబసింగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చాలీచాలని రూములతో ఇబ్బందులు పడుతున్న ఆశ్రమ పాఠశాల విద్యార్థినీలు. ప్రస్తుతం 320 మంది విద్యార్థినిలు ఇరుకైన చిన్న రూములలో చదువుకోవడం మరలా బెంచిలి తీసి పడుకోవడం కొంతమంది విద్యార్థినిలు రూములు చాలక బయట గ్రౌండ్లో నేలపై చదువుకోవడం జరుగుతుంది, గత తెలుగు దేశం ప్రభుత్వం హైములో స్కూల్ బిల్డింగ్ మంజూరు చేసారు అది పునాదిలు తీసి పిల్లరస్ కట్టి వదిలేసారు అక్కడ గోతుల్లో నీరునిల్వ ఉండి పోయి దోమలు విపరీతంగా పెరిగి పోయి రోగాలు బారిన పడి అవకాశం ఉందని ఆ గ్రామ పెద్దలు వద్యార్థి తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు నేడు పనులతో అన్ని స్కూళ్లను రూపుమారుస్తున్నారు కానీ లంబసింగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు ఆ భాగ్యం లేదని ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు తెలియపరిచిన వారి విద్యార్థినిలు సమస్య సమస్యలుగా మిగిలిపోయిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కిముడి లక్ష్మయ్య అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థినిలు కనీస అవసరతలు తీర్చాలని విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు మండలం ఈశ్వర పబ్లిక్ స్కూల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో ఈశ్వర కాన్వెంట్ ముందు అయ్యప్ప స్వాములు, ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు ఆందోళనకు పాల్పడ్డారు. అయ్యప్ప మాల వేసుకున్నందుకు విద్యార్థి నాగ మనోహర్ ను ప్రిన్సిపల్ శ్రీమన్నారాయణ దుర్భాషలాడారు. ప్రిన్సిపల్ మతం మారడం వల్లే అయ్యప్ప మాల వేసుకున్న తన కుమారుడు మనోహర్ ను దూషిస్తూ హేళన చేసినట్లు తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ ను ధార్మిక సంఘ నేతలు చుట్టుముట్టారు. స్కూల్ లైసెన్స్ రద్దు చెయ్యాలని, ప్రిన్సిపల్ వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పే వరకూ ఆందోళన విరమించేది లేదని హిందూ సంఘాల వారు పట్టుపట్టారు.




Total views : 80933