విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వందల సంఖ్యలో విద్యార్థి నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 32 మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి.
Tag:
Students rally
గుంటూరులో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు. హాజరై చిందులు వేశారు. సీఎం జగన్ మాస్కులతో జగన్ వల్లే విద్య అంటూ ఫ్లకార్డులు ప్రదర్శన చేశారు. మంచి నీళ్ళు ఇవ్వలేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తంచేశారు. మార్కెట్ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు అక్కడ నుంచి విద్యార్థులను పంపిచివేసారు.




Total views : 75246