ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఇస్కాన్టెంపుల్ ఆధ్వర్యంలో జులై 16న జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు. రాఘవకల్యాణ మండపం షార్ బస్టాండ్ నుంచి మొదలై రాత్రి 9 గంటలకు శ్రీనగర్ కాలనీకి చేరుకుంటుంది. ఇస్కాన్ స్వాములు ముఖ్య అతిథిగా పాల్గొని వారి సందేశాన్ని అందిస్తారని నిర్వాహకులు తెలిపారు. శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి సూళ్లూరుపేట పుర ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాధుని కృపాకటాక్షాలకు పాత్రులు కాగలరని జగన్నాథ రథయాత్ర కమిటీ సభ్యులు తెలిపారు.
Tag:






Total views : 180164