ప.గో.జిల్లా, తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టిన మాజి ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ,తెలుగుదేశం కార్యకర్తలు. నియోజకవర్గంలో చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీని పోలీస్ లు అడ్డుకుంటున్నారంటూ ధర్నా. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఒత్తిడితో పోలీసులు టిడిపి శ్రేణులను అడ్డుకుంటున్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కి ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు .
tanuku
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆదివారం రేపు జరిగే సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్దం చేసినట్లు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. స్థానిక వైయస్సార్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 25 వేల మంది వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు. యాత్రకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గం లో ని ప్రతి గ్రామం నుంచి భారీ బస్సు యాత్రకు తరలిరాన్నుట్లు తెలిపారు. బస్సు యాత్ర అనంతరం గాంధీ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు అనేక మంది మంత్రులు, విడుదల రజిని మెరుగ నాగార్జున శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులతో పాటు అన్ని రకాల కార్పొరేషన్ లో ఛైర్మన్ లు పాల్గొంటారని తెలిపారు. ఈ బహిరంగ సభలో గత నాలుగున్నర సంవత్సరాలో వైయస్సార్ సిపి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించనున్నట్లు తెలిపారు. అలాగే మళ్ళీ తిరిగి నందిగామ నియోజకవర్గంలో డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గెలుపుకు నాంది పలుకుతుందని తెలిపారు.




Total views : 79177