అంగన్వాడీ కార్యకర్తలు, సహాయక సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్ఠ అని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసనలు చేయడం కూడా నేరమా? అని ప్రశ్నించారు. ఎస్మా ప్రయోగం, జీతంలో కోత నియంత పోకడలకు ప్రబల నిదర్శనం అని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం జీవో నెం.2ను వెనక్కి తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అంతిమంగా నెగ్గేది అంగన్వాడీలేనని అన్నారు. ఏపీలో అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
Tdp
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మిత్రపార్టీ జనసేనతో కలిసి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ‘రా.. కదలి రా..’ పేరుతో శుక్రవారం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో నిర్వహించిన సభకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని సంకల్పం చేయాలని కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక్క ఛాన్స్ అన్న జగన్ మాయలో పడ్డారని.. పాదయాత్రలో అందరికీ ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు అంటూ ధ్వజమెత్తారు. కుటుంబ పెద్ద బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మేం ఐటీ ఆయుధం ఇస్తే.. జగన్ రూ.5వేల ఉద్యోగం ఇచ్చారన్నారు. జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. 2029 నాటికి ఏపీ నంబర్ వన్ కావాలని ప్రణాళికలు రచించామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. తన అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు.
కడప జిల్లా, కాజీపేటలో 300 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరిక. వైకాపా ఎంపీటీసీ చంద్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టీడీపీలోకి చేరికలు. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలని సొంత పార్టీ ఎంపీటీసీ అడిగితె సస్పెండ్ చేసిన ఘనత వైకాపా కు చెందుతుంది. వైకాపా ఎంపీటీసీనే చేరుతున్నారంటే వారి అరాచకం అర్ధం అవుతుంది. రాష్ట్రానికి అభివృద్ధి కావాలి సంక్షేమం కాదు. అభివృద్ధి లేకుండా సంక్షేమం పనికిరాదు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని రాత్రికి రాత్రే అరెస్టు చేస్తారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. నియంత పాలన ఎక్కువ రోజులు ఉండదు. మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి కి దోచుకోవడం తప్పితే అభివృద్ధి చేయడం తెలియదు. శాసనసభ్యుడు రఘురామిరెడ్డికి సంక్షేమానికి, అభివృద్ధికి తేడా కూడా తెలియదు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం అని వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరుతున్నారు. తెలుగుదేశం లోకి స్వచ్ఛంగా చేరుతున్న వైసీపీ పార్టీ అధికార నాయకులు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. కాజీపేట మండలం అభివృద్ధిలో వెనకబడి ఉంది అని వెల్లడించారు.
విజయవాడ, టీడీపీకి గుడ్ బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని. త్వరలో టీడీపీకి రాజీనామా చేయనున్న ఎంపీ కేశినేని నాని. ఫేస్ బుక్ పోస్ట్, ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించిన కేశినేని నాని. తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన. త్వరలో ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ను కలిసి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తా.
అవ్వా తాతలు, వితంతువులు, వికలాంగులకు రూ 3 వేలు పెన్షన్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్టం ఆంధ్రప్రదేశ్ అని, ఈ ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పండుగ వాతావరణంలో జరిగిన రైల్వే కోడూరు మండల పెన్షన్ల పెంపు మరియు నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి మాట నిలబెట్టుకున్నారన్నారు. రైల్వే కోడూరు మండలంలోనే సుమారు 11 వేలుకు పైగా పెన్షన్లు పంపిణీ అవుతున్నాయన్నారు. నెలకు పెన్షన్ల క్రింద రైల్వే కోడూరు మండల పరిధిలో రూ.10 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో కొత్త పెన్షన్ మంజూరు కావాలంటే ఎవరైనా చనిపోతేనే వచ్చేదన్నారు. జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పింఛన్లు అందుతున్నాయన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాను పల్లెలకు వెళ్లినప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో చట్టబద్దత లేని జన్మభూమి కమిటీలు రాజ్యమేలాయన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు బేరీజు వేసుకుని ప్రజలు వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అధికారమే పరమావధిగా చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో, దుష్టచతుష్టయం తో పావులు కదుపుతున్నారన్నారు. పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సర మరియు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ తో పాటు స్వీట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, ఏపీ టూరిజం డైరెక్టర్లు వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి, మందల నాగేంద్ర, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ సుబ్బరామరాజు, ఉప సర్పంచ్ తోట శివ సాయి, పట్టణ కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు శృంగవరపుకోట మండలంలో చిన్నవేమల వీధి మరియు గౌరీ శంకర్ కాలనీలో ఏర్పాటు చేసిన *బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యమక్రమానికి ముఖ్య అతిధిగా శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం నేత మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ణ హాజరయ్యారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. మినీ మేనిఫెస్టో తో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయని గొంప క్రిష్ణ తెలిపారు. అనంతరం గొంప క్రిష్ణ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సుపరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్ ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పిన మాటని, ఆ మాటను పక్కన పెడితే జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న వింత నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాల తీరు, పాలనా విధానం చూస్తుంటే రాష్ట్రంలో ఎవరూ బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు మోసం చేశాడని క్రిష్ణ మండిపడ్డారు.
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళగిరి టిడిపి కార్యాలయంలో జయహో బీసీ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు టిడిపి బీసీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం బీసీలకు ఎటువంటి అభివృద్ధి ఫలాలు అందించలేదని, విలువైన పదవులు అధికారాలు పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు తప్ప బీసీలను ఎక్కడ పట్టించుకోలేదని, కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదని, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేసి బీసీలకు మరిన్ని రాజ్యాధికార పదవులు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారని అన్నారు. వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ని ఓడించబోతుందని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు అంటున్నారు.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను తొలగించి ఆ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… చింతలపూడి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఉన్నమట్ల ఎలిజా స్థానంలో మరొక అధికారికి అవకాశం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏలూరు ఆర్టీఏ వెహికల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న విజయరాజుకు చింతలపూడి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ చింతలపూడి ఎమ్మెల్యే కు నో చెప్పినట్లు తెలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ తో చింతలపూడి టికెట్ తనకే ఇవ్వాలంటూ ప్రాధేయపడినప్పటికీ, చింతలపూడి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఎలిజాకు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే ఎలిజాను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రతిపాదన చేశారని అయితే తాను చింతలపూడిలోనే పోటీ చేస్తానని ఎంపీగా పోటీ చేయనని అన్నట్లు తెలుస్తుంది. దీనికి తోడు తాజాగా తన అనుచర గణంతో తాడేపల్లిలోని మిథున్ రెడ్డి ఇంటి వద్ద తనకే టిక్కెట్ ఇవ్వాలంటూ తన అనుచరులతో ధర్నాలు చేయించారు. ఒకవేళ వైసీపీ అధిష్టానం తలొగ్గి ఎలిజాకు టికెట్ ఇస్తే ఈసారి తప్పకుండా చింతలపూడిలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని పార్టీ వర్గాల్లో, ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచిన ఎలిజా ఇప్పటికే దండుగా ప్రజావ్యతిరేకతను మూట కట్టుకున్నారు, ఐప్యాక్ సర్వేలో ఎమ్మెల్యే ఎలిజాకు మైనస్ మార్కులు రావడంతో సీఎం జగన్ ఎమ్మెల్యే ఎలిజానుపక్కన పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.
జీఎస్టీ కమిషనర్ ఉద్యోగి గా పనిచేసిన ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ఉద్యోగాన్ని పక్కన పెట్టి 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. అంతకముందు టీడీపీ కంచు కోటగా చింతలపూడి నియోజకవర్గం ఉండేది. 1983 నుంచి 1999 వరకు ఐదు సార్లు టీడీపీ తరుపున పోటీ చేసిన కోటగిరి విద్యార్ధ రావు గెలుపొందారు. ఆ తరవాత సామాజిక సమీకారణాల నేపథ్యంలో జనరల్ నియోజకవర్గంగా ఉన్న చింతలపూడి ఎస్సి నియోజకవర్గంగా మారింది. 2014 లో మాజీ మంత్రి పీతల సుజాత టీడీపీ తరుపున పోటి చేసి గెలిపోందారు. 2019లో ఫ్యాన్ గాలిలో గెలిచిన ఎలిజా వలన జరిగిన నియోజక వర్గ అభివృద్ధి దేవుడెరుగు ఎక్కడ రూపాయి వస్తుందో అక్కడికి వాలిపోవడమే కాకుండా ఎమ్మెల్యే గా నాలుగు సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయలు వెనకేసారని నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్యే ఎలిజాపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎమ్మెల్యేగా మా గ్రామంలో ఎం అభివృద్ధి చేసావు.. మాకిచ్చిన హామీలు ఎక్కడా అంటూ ప్రజలు నిలదీస్తున్నడంతో తిరిగి ఎమ్మెల్యే ఎలిజాకు నియోజకవర్గంలో టికెట్ ఇస్తే పరాజయం తప్పదని తెలుసుకున్న పార్టీ అధిష్టానం కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.
చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తిని నిలబట్టేందుకు వైసీపీ అధిష్టానం కార్యాచరణ రూపొందిస్తే…. టిడిపికి కంచుకోటగా ఉన్న చింతలపూడి నియోజకవర్గాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టిడిపి జెండా ఎగరవేసేందుకు తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుండట… ఇందులో భాగంగానే ఎన్నారై గా ఉన్న బొమ్మాజీ అనిల్ టిడిపి టికెట్ కోసం తన ప్రయత్నాలు జరుపుతూనే… నియోజకవర్గంలో జరుగుతున్న టిడిపి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ నియోజకవర్గ టిడిపిలో చక్రం తిప్పే నేతల మద్దతు కూడా కూడబెట్టి, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై అధికార పార్టీపై పోరాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇటీవల నారా లోకేష్ చేపట్టిన యువగళమ్ పాదయాత్ర చింతలపూడి నియోజకవర్గంలో దాదాపు మూడు రోజులపాటు సాగింది. నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయడంలో కూడా బొమ్మాజీ అనిల్ కృషి చేశారని టిడిపి వర్గాలు కూడా అనిల్ కు ఈసారి టిక్కెట్ ఇస్తే నియోజకవర్గంలో టిడిపికి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా టిడిపి టికెట్ కోసం మరో ఎన్నారై సొంగా రోషన్ కుమార్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గత కొంతకాలంగా సొంగ రోషన్ కుమార్ టిడిపిలో పనిచేస్తూ నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇటు నియోజకవర్గంలో టిడిపి చేపట్టే కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ జెండా ఎగరవేస్తానని పార్టీ బాస్ వద్ద టిక్కెట్ కోసం తన ప్రయత్నాలు జరుపుతున్నారు. వీరితో పాటు మాజీ మంత్రి పీతల సుజాత, మరి కొంతమంది ఆసవాహులు టికెట్ కోసం తమ ప్రయత్నాలు తాము జరుపుతున్నారు.
చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి… అక్కడ పాగా వేయాలని చూస్తుంటే… వైసీపీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తూ టిడిపి కంచుకోట ను కైవసం చేసుకునేందుకు ఇటు టిడిపి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. దీంతో చింతలపూడి నియోజకవర్గంలో అటు టిడిపి ఇటు వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా కొత్తవారు బరిలో నిలుస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
శ్రీకాకుళం జిల్లా, నిజం గెలవాలి పేరుతో నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల లో పర్యటించనున్న నారా భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో మనస్థాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి. రాజాం జి.ఎం.ఆర్ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం దవలపేట గ్రామానికి చేరుకొని మృతి చెందిన కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి. అనంతరం అక్కడ నుండి మన్యం జిల్లా
భామిని మండలం బిల్లమడ గ్రామానికి చేరుకొని బిల్లమడ గ్రామంలో మృతి చెందిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని పరామర్శ. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం తోటాడ గ్రామం చేరుకొని తోటాడ గ్రామంలో గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం దన్నానపేట గ్రామంలో మృతి చెందిన గొర్లె తిరుపతిరావు కుటంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం పాత నిమ్మతొర్లాడ గ్రామం చేరుకొని ఆగ్రామంలో మృతి చెందిన ఆకేటి పాపయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
అన్నమయ్య జిల్లా రాయచోట, తెదేపా తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ద్వారక నాథ్ రెడ్డి. వైసీపీ రాజ్యసభ సభ్యుడి స్వయానా బావమరిది ద్వారక నాథ్ రెడ్డి. ఆయన తండ్రి అయినా రామ సుబ్బారెడ్డి 1978 కాంగ్రెస్ పార్టీ తరపున లక్కిరెడ్డీ పల్లి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ద్వారక నాథ్ రెడ్డి 1994 లో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో తెదేపా తరపున టికెట్ ఇవ్వకపోవడంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2009 లో టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 వైసీపీ తరపున టికెట్ ఆశించారు. 2019 లో వైసీపీ, తేదేపా టికెట్ ఆశించినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ద్వారకా నాథ్ రెడ్డి. గత కొన్ని రోజులుగా తెదేపా టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు. ఈ రోజు విజయవాడ కేంద్రంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న భారీ బహిరంగ సభలో తారకరత్న అత్త ,అలేఖ్య రెడ్డి అమ్మ,ద్వారక నాథ్ రెడ్డి అక్క హరమ్మ సమక్షంలో పసుపు కండువా వేసుకొనున్నట్లు ఆయన అనుచరవర్గం వెల్లడించారు.