పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా రంగ చిత్ర పటానికి, విగ్రహాలకు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగాను హతమార్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అందుకే టిడిపిని దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఎన్నోసార్లు టిడిపి ప్రభుత్వం రంగాను చంపిందని చంద్ర బాబే చంపాడన్నారు. చంద్రబాబు నన్ను కూడా చంపాలని చూసాడు కాని నన్ను చంపలేకపోయాడని నారాయణ అప్పట్లో అన్నారు. పదవే శాశ్వతమా, పదవి కోసం పాకులాడాలా, పదవి కోసం పాకులాడే వారిని ఈ సమాజం క్షమించకూడదని కన్నాని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజశేఖర్ రెడ్డి వెంబడి నడిచాను ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంబడే నడిచాను అని అన్నారు. ఆరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా ఊహించారా. జగన్ ను జైల్లో పెడతానన్నారు అలాగే నన్ను కూడా జైల్లో పెడతారు అన్నారు. సిబిఐ కూడా నన్ను పిలిచింది అయినా నేను నమ్ముకున్న మనిషి కోసం సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నాను.
Tdp
ఎపి రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్య పడుతుందన్నారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, జనసేన నేత అత్తిగారి దినేష్. అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరు లో టీడీపీ నేతలు గగ్గుటూరి ఖాదర్ బాషా గగ్గుటూరి హుమయూన్ ఆధ్వర్యం బాబు సూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, జనసేన నేత అత్తిగారి దినేష్ ఇరువురు హాజరయ్యారు. ర్యాలి తో పాటు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు రాబోవు ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వెంటనే నేవేర్చే హమిలన్నింటిని కుడా ప్రజలకు కరపత్రాల ద్వారా చైతన్య వంతులను చేస్తూ వారి ప్రచారం కోనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి ఒక జాబు క్యాలెండర్ అన్నారు మరి నాలుగన్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎన్ని జాబు క్యాలెండర్లు విడుదల చేసారో యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో ఎ ఒక్కరు సంతోషంగా లేరని ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్ ప్రభుత్వాన్నిఎప్పుడు గద్దె దించూదామా అన్నట్టు ప్రజలు ఎదురు చుస్తున్నరన్నారు. జగన్ సామజిక బస్సు యాత్ర కేవలం సోకు మాత్రమే తప్ప ప్రజలలో మాత్రం ఎటువంటి స్పందలేదన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలన్న రాష్ట్రంలో సిఎం గా చంద్రబాబు గారు రాజంపేట ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్ధులను కచ్చితంగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా కష్ట పడలన్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి ఓటమి భయం పుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, పార్టీ నాయకుల, కార్యకర్తలు తో పాటు మైనార్టీ నాయకుల పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా కర్లపాలెం వైసీపీలో గందరగోళ వాతావరణం నెలకొంది. వైసీపీకి గుడ్ బాయ్ చెప్పి కర్లపాలెం మైనార్టీ సోదరులు టిడిపి పార్టీలో చేరుతున్నారు. వీరిని తమ పార్టీలోకి టీడీపీ నాయకుడు నరేంద్ర వర్మ సాదరంగా ఆహ్వానించారు. బాపట్ల లో టిడిపి అధినాయకుడి ఆశీస్సుల కోసం నియోజకవర్గంలోని అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్ మహాసేయులు బారులు తీరుతున్నారు. నాడు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు నియోజకవర్గంలోని దళిత క్రైస్తవ సోదర సోదరీమణులు తండోపతండాలుగా తరలివచ్చారు. నేడు క్రిస్మస్ పర్వదినాన వైసీపీని వీడి అచంచలమైన విశ్వాసంతో కర్లపాలెం కు చెందిన 200 మంది మైనారిటీ సోదర సోదరీమణులు నరేంద్ర వర్మ చెంత చేరారు. రోజురోజుకు నరేంద్ర వర్మ కు పెరుగుతున్న మద్దతు, సర్వమత ప్రజల ఆదరాభిమానాలు, పార్టీ అధినాయకుడి భవిష్యత్తుకు గ్యారెంటీ తమకు ప్రేరణ కలిగించి నేడు వైసీపీని వీడి టిడిపి పార్టీలో చేరామని మైనారిటీ సోదర సోదరీమణులు ముక్తకంఠంతో తెలిపారు. నాడు ఒక్క ఛాన్స్ అని జగన్ కు ఓటేస్తే నట్టేట ముంచేసాడని నేడు వైసిపి పాపం పండిందని ప్రజలలో అసహనం పెరిగి విసిగి వేసారి పోయారని అందరి చూపు టిడిపి వైపేనని నరేంద్ర వర్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం, కరేడు పంచాయతీలోని పెద్దపల్లెపాలెం గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు, ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన తంబు శీను, వల్లభోని మల్లికార్జున, వల్లభోని వెంకటేశ్వర్లు, కొక్కిలిగడ్డ ప్రసాద్, కొక్కిలిగడ్డ వెంకట్రావు, కొక్కిలిగడ్డ కృష్ణారావు, నాయుడు రాజు, నాయుడు రాము, నాయుడు లక్ష్మణ్, నాయుడు సురేష్, పల్లెపాటి బాబులు, వల్లభోని నరసింహారావు లు పార్టీలో చేరగా… నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, కొత్తగా వచ్చిన వారికి పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తూ పాత, కొత్త నాయకులు అందరు కలిసి పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. త్వరలోనే కందుకూరు నియోజకవర్గం నుంచి పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గాలను చూడలేక, వైసీపీ నుంచి అనేకమంది బయటికి వస్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు.
మాజీమంత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాo విలేకర్ల సమావేశంలో యువగళం నవశకం అనంతరం వైఎస్సార్సీపీ బెంబేలెత్తి పోయింది. దాదాపు 5లక్షల మంది హాజరైన నవకశం సభ, ప్రజలు ఏరకంగా వైఎస్సార్సీపీ పట్ల విముఖతతో ఉన్నారనేది స్పష్టమవుతోంది. ఒకచోట పనికిరానటువంటి వ్యక్తిని మరొక చోట తీసుకెళ్లి పెట్టిన ఏరకంగా ఆ వ్యక్తి చెల్లుబాటు అవుతారనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరముంది. ఈ యువగళం పాదయాత్ర ఇదేమీ ముగింపు కాదు ఇది ఒక నవశకానికి ఆరంభం. చంద్రబాబు చెప్పినట్లుగా జనసేన పొత్తు రేపటి ఆంధ్ర భవిష్యత్తుకు అత్యంత అవసరం. రెండూ పార్టీలు ప్రజా ప్రయోజనాల కోసo పొత్తుతో వైఎస్సార్సీపీ ఓటమి ఖాయమయ్యింది. రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి రేపటి ఎన్నికల్లో 165 స్థానాల్లో ఎమ్మెల్యేల గెలుపు, 25 ఎంపీల గెలుపు ఈ గెలుపు రేపటి ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తుంది, జగన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యం అనేక రకాలుగా చట్టాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఇవన్నీ తొలగిపోతాయి. అరాచక ప్రభుత్వాన్ని పూర్తిగా తొలగించటo టీడిపి, జనసేన ల లక్ష్యం, పొత్తు యొక్క ఉద్దేశ్యం. రేపు జరుగబోయే ఎన్నికలు జగన్మోహన్రెడ్డికి ఆంధ్రులు ఐదున్నర కోట్ల మంది ప్రజానీకం యొక్క ఆత్మగౌరవం మధ్య జరిగే యుద్ధమిది, జగన్మోహన్రెడ్డి అవమానించి, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. ప్రజా ఆస్తుల్ని దోచుకుంటున్న తరుణంలో రేపు ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఓటు వేస్తారనేది సందేహం లేదు. రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్రెడ్డి కి బైబై చెప్పటానికి సమాయాత్తమయారు.
గుంటూరు సీఐడీ కార్యాలయం ఎదుట టిడిపి నేతల ఆందోళన. బొడ్డులురి యశశ్విని అక్రమ అరెస్ట్ అంటూ నినాదాలు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న యశస్విని. తల్లికి అనారోగ్యంతో హైదరాబాద్ కి విచ్చేసిన యశస్విని. గత కొంత కాలంగా ప్రభుత్వం పై అనుచిత పోస్టులు పెడుతున్నారని సీఐడీ అరెస్ట్. ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తి చూపుతున్న కారణంగా అరెస్ట్ అంటున్న టిడిపి నేతలు. అక్రమ అరెస్ట్ చేసిన యశస్విని విడిచి పెట్టాలని టిడిపి నేతల డిమాండ్.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువగళం పాదయాత్ర టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపింది అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి నాయకులకు ధన్యవాదాలు అని, నరసరావుపేటలో టీడీపీ గెలుపు కోసం నాలుగున్నర ఏళ్లుగా పని చేస్తున్నాను అన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సి, ఎస్టీ, బీసీలు బ్రహ్మరథం పడతారు అని, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అన్నారు. యువగళం విజయంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు అని తెలియజేశారు.
వైసిపి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన దాడులు నిర్వహించిన పారిపోమని టిడిపి ఓట్లను తొలగించడం, ఓట్లు వేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. పల్నాటి ప్రజలు టిడిపి పార్టీని ఆదరించారని ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి టిడిపి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఇంకొక మూడు నెలలు ఓపిక పట్టండని నష్టపడ్డ ప్రజలకు, ప్రతి టిడిపి కార్యకర్తకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు. ఓటమి భయం వైసిపి పార్టీని వెంటాడుతుందని వ్యవస్థలను వెంటబెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయమని ప్రజలు, కార్యకర్తలు భయపడవద్దని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసిన కూడా లోకేష్ పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగిందని అది జీర్ణించుకోలేని వైసిపి ప్రభుత్వం వారు పాదయాత్ర మొదలు పెట్టిన దగ్గర నుండి ఎద్దేవా చేస్తూనే ఉన్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు తమ ఓటు హక్కుతో వైసిపి ప్రభుత్వంకు ఓటమిని 70mm లో సినిమా చూపిస్తారని ఆయన అన్నారు.
యువగళం సభ సక్సెస్ కావడంతో వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని టీడీపీ నాయకులు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందనే భయం వైసీపీ నాయకుల్లో కలుగుతోందని సూళ్లూరుపేట టీడీపీ ఇంఛార్జ్ నెలవల సుబ్రమణ్యం తెలిపారు. టీడీపీ – జనసేన పార్టీ ఉమ్మడిగా రానున్న ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. యువగళం ముగింపు సభకు వచ్చిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. అవినీతి అరాచక వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరినీ నిలబెట్టినా కార్యకర్తలంతా ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని సుబ్రమణ్యం తెలిపారు.
Read Also..
Read Also..
నారా లోకేష్ది అట్టర్ ప్లాప్ యాత్ర అని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు పాపపు సొమ్ముతో లోకేష్ యాత్ర చేశారు. యువగళం యాత్రతో టీడీపీ ఏం సాధించిందని పేర్ని నాని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ అట్టర్ ప్లాప్ సినిమా. అది పాదయాత్ర కాదు జంపింగ్ జపాంగ్ యాత్ర. లోకేష్ యాత్ర కోసం వచ్చి మేనమామ కొడుకు చనిపోతే ఆపలేదు. కానీ, చంద్రబాబు జైలుకు వెళ్తే మాత్రం యాత్రను ఆపేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు సమస్యల పరిష్కారానికి ఆలోచిస్తాడు. యువగళం యాత్ర పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టారు. రాజకీయ లబ్ధి కోసమే మొక్కుబడి యాత్ర చేశారు. సాయంత్రం సూర్యుడు దిగిపోయాక లోకేష్ బయటకు వస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.