డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న నియోజకవర్గం రామచంద్రపురం. గతంలో ఈ నియోజకవర్గానికి రెండు వర్గాలు ప్రాతినిధ్యం వహించేవి. ఇప్పుడు సీను మారింది. ఎవరికి వారే యమునా తీరేగా మారిపోయారు. గతంలో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రత్యర్థులుగా ఉండి పోటీపడేవారు. ఒకసారి తోట నెగ్గితే మరోసారి బోసు నెగ్గె వారు. వైసిపి ఏర్పడ్డ అనంతరం కూడా వీరిద్దరి మధ్య వివాదాలు, పోటీలు జరిగాయి. అనంతర పరిణామాల్లో అనూహ్యంగా తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. దీంతో బద్ధ శత్రువులైన బోస్, త్రిమూర్తులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ ఇద్దరు ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. త్రిమూర్తులు టిడిపిలో ఉన్నప్పుడు బోసు భార్యపై ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నట్లు కేసు పెట్టారు. ఎస్ ఎస్ టి కేసులు కూడా బోస్ కుటుంభం పై పెట్టించారు. అదే విధంగా త్రిమూర్తులు తన పార్టీలో చేరినప్పటికీ ఆయన తనకు ప్రత్యర్థి అని బోసు బహిరంగంగా వాదించారు. వీరిద్దరినీ కాదని వైసిపి అధినేత జగన్ రామచంద్రపురం టికెట్ 2019 ఎన్నికల్లో కోనసీమకు చెందిన చెల్లుబోయిన వేణుకు ఇచ్చారు. ఆయన విజయం సాధించారు. మంత్రి అయ్యారు. దీంతో మంత్రి వేణు అటు బోస్, ఇటు త్రిమూర్తులకు చెక్ పెట్టారు. తన పవర్ పెంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో బోసు కుమారుడు రామచంద్రపురం టికెట్ తనదేనంటూ వైసీపీలో ప్రత్యేక కుంపటి పెట్టారు. దీనితో వేణు, బోసు మధ్య ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొక ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. తోట త్రిమూర్తులు టిడిపిని వదిలేసిన తర్వాత చాలాకాలం ఆ పార్టీకి ఇంచార్జి లేరు. దీంతో కోనసీమ జిల్లాకి చెందిన శాసనమండలి మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను తీసుకొచ్చి ఇంచార్జిగా నియమించారు. కొంతకాలం ఆయన అసమ్మతి లేకుండా నెట్టుకు వచ్చారు. ప్రస్తుతం టిడిపి ఇన్చార్జిగా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం వై సి పి కి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి వేణు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. పైగా వీరు ఇరువురు మంచి స్నేహితులు. వీరు ఇరువురు కాంగ్రెస్ లో కలిసి పనిచేసినప్పుడు కాంట్రాక్ట్ లు కూడా చేశారు. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగేవి. ఈ నేపథ్యంలో రెడ్డి సుబ్రమణ్యంకు టిడిపి టికెట్ ఇస్తే తాము పని చేయమంటూ శెట్టిబలిజ సామాజిక వర్గం కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చింది. మరోపక్క జనసేన ఈ సీటు పై కన్నేసింది. ప్రస్తుతం రామచంద్రపురం ఇన్చార్జిగా ఉన్న పోలిశెట్టి చంద్రశేఖర్ కు పార్టీలోనూ ప్రజల్లోనూ పెద్దగా ఆదరణ లేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యాపారవేత్త చిక్కాల దొరబాబును జనసేనలోకి తీసుకువచ్చారు. రామచంద్రపురాన్ని పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. శెట్టిబలిజ సామాజి వర్గానికి టికెట్ ఇస్తే ముమ్మిడివరానికి చెందిన జనసేన నేత పితాని బాలకృష్ణ కాపు సామాజిక వర్గానికి ఇస్తే కొత్తగా చేరిన చిక్కాల దొరబాబుకు టిక్కెట్టు ఖరారు అని చెప్తున్నారు. అయితే పితాని వద్ద ఆర్థిక బలం లేదు. ఈ రెండు దొరబాబు వద్ద ఉన్నాయి. దీంతో రెడ్డి సుబ్రహ్మణ్యానికి, ఆయన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టేందుకు ఈ టిక్కెట్టు జనసేనకు వదిలేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అదే జరిగితే దొరబాబు జనసేన తరపు అభ్యర్థి అవుతారు. బోస్ లేదా ఆయన తనయుడు వైసిపి నుంచి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి వేణును రాజమండ్రి ఎంపీ లేదా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా పంపిస్తారని నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బోస్ లేదా ఆయన తనయుడును బలంగా ఢీకొనే సత్తా జనసేనకు దక్కుతుంది. మరోపక్క రెండు పార్టీల్లో ఉంటూ స్నేహితులుగా లాలూచీ రాజకీయాలు చేస్తున్న రెడ్డి సుబ్రహ్మణ్యం, వేణులకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై చర్చలు జరుగుతున్నాయి.
Tdp
ఉత్తరాంధ్ర పసుపు సంద్రంగా మారిపోయింది.. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల జనాభా వస్తారని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా… రాయచోటి… ఎపిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు విసుగుపొయ్యారని ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చుస్తున్నారన్నారు రాజంపేట జనసేన నాయకులు మల్లిశెట్టి రమణ. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో జనసేన జనబాటను, పవనన్న ప్రజాబాట ప్రచారా కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగిందన్నారు. అందులో బాగంగా మంగళవారం వీరబల్లి మండలం ఓదివీడు గ్రామంలో జనసేన నాయకుల, కార్యకర్తలతో కలిసి వారు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల నాయకత్వం ఎంతో అవసరం అని రానున్న ఎన్నికలలో జనసేన, తెదాపా పార్టీల అభ్యర్ధులను ఆదరించాలంటూ తెదాపా, జనసేన ఆశయాలను ఇంటింటికి కరపత్రాలతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు వైసిపి ప్రభుత్వం అధికారంలో కి వచ్చి నాలుగన్నర ఏండ్లు అవుతున్నప్పటికీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విపలం అయ్యిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టి ప్రతి మనిషికి లక్షల్లో తలభారం మోపరన్నారు. రానున్న ఎన్నికలలో వైసిపి ప్రభుత్బం డబ్బులతో ఓట్లు కొనేందుకు సిద్దపడుతుందన్నారు. ఎపి లో పెట్టుబడులు పెట్టేందుకు కుడా ముందుకు రాని దుస్థితి నెలకొందన్నారు. ప్రజలు జనసేన, తెలుగుదేశం పార్టీ కి నీరాజనం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా తెలుగుదేశం, జనసేన పార్టి తరపున ఎవ్వరికి కేటాయించిన కలిసి పని చేసి తిరతామన్నారు. వారి వెంట జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నగరి ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… 175 నియోజకవర్గాలలో క్యాండెట్లు లేకుండా వైసిపి నుంచి ఎవరు బయటకు వస్తారా అని టిడిపి, జనసేన గోతి కాడ నక్కల వేచి చూస్తున్నారని ఆరోపించారు. ప్రతి రోజు గడప గడపకి వెళ్తూ.. పల్లె నిద్ర చేస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో ముందు ఉన్నాను అన్నారు. పచ్చ మీడియా దిగజారుగు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. నగరిలో సీటు రోజాకు లేకుంటే.. రాధాకృష్ణ నిల్చుంటాడు.. రామోజీ రావు నిల్చుంటాడా అంటూ ఎద్దేవా చేశారు. మాలో మేము కొట్టుకొని సీటు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఆ అభ్యర్థులను టిడిపికి మళ్లించేద్దాం అని గోతికాడ గుంట నక్కల వ్యవహరిస్తున్నారని, జగన్ అన్న పై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందో.. అంతకు మూడింతల్లు పార్టీలో మా అందరికి ఉందని, ప్రజల వద్ద జగన్ అన్నకు వ్యతిరేకత లేదని, జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికి 100% పనిచేస్తాం అన్నారు. మళ్లీ మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్థించా అన్నారు. ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోతే వేరొక పదవి ఇచ్చేలా సీఎం జగన్ చూస్తున్నారని,
చంద్రబాబు., పవన్ కళ్యాణ్ లు ఒక్క చోట నిలబడటానికి భయపడుతున్నారని అన్నారు. అందుబాటులో ఉన్నా కాబట్టే రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రులు అయ్యాం అని అన్నారు. 175కి 175 పక్కాగా గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేసారు. నగరిలో ఎవరికి ఇచ్చిన నేను జగన్ అన్నకు ప్రాణం ఇస్తా అన్నారు. నాకు ఎమ్మెల్యే సీటు లేదు అనే ప్రచారం కేవలం శునకానందమే అని అన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర నిన్నటితో పూర్తి అయింది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2028 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు దిగ్విజయంగా లోకేష్ పాదయాత్ర జరిగింది. మొత్తం 3వేల 132 కిలో మీటర్లు మేర లోకేష్ పాదయాత్ర చేశారు. గతంలో టీడీపీ అధినేత, తండ్రి చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రను ఎక్కడైతే ముగించారో లోకేష్ కూడా అక్కడే తన యువగళం పాదయాత్రను ముగించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా అగనంపూడి వద్ద నారా లోకేష్ పైలాన్ ఆవిష్కరించారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. వారందరికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి అసమర్ధుడు సీఎం అయ్యారని, వ్యవస్థలన్నింటినీ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళమని పేర్కొన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుకైందని చెప్పారు. భవిష్యత్ పై ఆశలు కోల్పోయిన యువతకు తన యువగళం పాదయాత్రతో భరోసా కల్పించానని చెప్పారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలన్నింటికీ కట్టుబడి ఉన్నామని లోకేష్ స్పష్టం చేశారు.
వైసీపీలో ఇంచార్జుల మార్పులపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని, అందుకనే వైసీపీలో మార్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ సహా వైసీపీ నాయకులందరూ అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ఇక నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తే మరో చోట ఆహ్వానిస్తారా అని ప్రశ్నించారు. చెల్లని రూపాయి ఏ నియోజకవర్గంలోనైనా పనికి రాదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కేసిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత జగన్దేనని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే అసహించుకునే పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని స్థితిని కల్పించాలన్నారు. అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు అవుతున్నా రాష్ట్ర ప్రగతిపై ఏం సాధించారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి, సంక్షేమం కూడా సమానంగా కొనసాగించారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
టిడిపి ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. జనవరి 27వ తేదిన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర రాష్ట్రంలో 226 రోజులపాటు 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు సాగింది. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గంలో యాత్ర ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు యాత్ర సాగించాలని ముందుగా టిడిపి భావించింది. ఈ ప్రకారం వచ్చే జనవరిలో శ్రీకాకుళం జిల్లాలో ముగించాల్సి ఉంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో సెప్టెంబర్ 9వ తేదితో యాత్ర నిలిచిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్పై వచ్చిన తరువాత నవంబర్ 27 నుంచి తిరిగి ప్రారంభించారు. సుమారు 80 రోజుల పాటు యాత్ర సాగలేదు. మరోపక్క ఎన్నికల సమయం దగ్గర పడటంతో యాత్రను వీలైనంత త్వరగా ముగించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రవేశించకుండానే యాత్ర ముగియనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ఇబ్బందులు పడుతున్న సకలజనుల గొంతుకను అవుతానని లోకేష్ యాత్ర ప్రారంభానికి ముందు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రతి సభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని అధికార పార్టీ నేతలపై విమర్శల దాడి చేశారు. అదేవిధంగా యాత్రలో పలు సమస్యలపై అధికార యంత్రాంగానికి 600పైగా లేఖలు రాశారు. పాదయాత్ర పూర్తయిన ప్రతి వంద కిలోమీటర్ల ప్రాంతంలో అక్కడి ఉన్న సమస్యను అధికారంలోకి రాగనే పూర్తిచేస్తానని శిలఫలాకలతో లోకేష్ హామీ ఇచ్చారు. 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. భారీ స్థాయిలో ముగింపు సభ, యువగళం విజయోత్సవ సభను టిడిపి భారీస్థాయిలో నిర్వహించనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ నెల 20వ తేది విజయోత్సవ సభను జరపనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు వస్తారని అంచనా వేసింది. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపూర్, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ఏడు ప్రత్యేక రైళ్లను టిడిపి సిద్ధం చేసింది. ఈ సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.
గుంటూరు.. అంగన్వాడి ల చేస్తున్న ఉద్యమానికి టిడిపి మద్దతు ప్రకటిస్తుంది. అంగన్ వాడి టీచర్లపై జగన్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారం లోకి వస్తే వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన జగన్ రెడ్డి నేడు వారిపై లాఠీ ఛార్జ్ చేయడం బాధాకరం. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించడం లో రాష్ట్రప్రభుత్వం విఫలమైంది. గతంలో ఉన్న అంగన్వాడీ జీతాలు కంటే కేవలం 1000 మాత్రమే ఈ జగన్ రెడ్డి పెంచాడు. అంగన్వాడీలకు మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని ప్రచారాలు మాత్రమే చేసుకుంటున్నారు. అంగన్వాడీ లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు సీనియర్లకు 26000 పెంచాలని అడుగుతున్నారు. అంగన్వాడీ లు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయ కేతనం ఎగుర వేస్తుంది.
విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగాల నాయకులు గూడవల్లి నరసింహారావు ఇంటిపై అల్లరి మూక దాడికి నిరసనగా, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రసాదంపాడు నుండి రామరపాడు రింగు రోడ్డు వరకు ఆందోళన నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టి జాతీయ రహదారిపై బైఠాయించి, దాడికి పాల్పడిన అల్లరి మూకలను వెంటనే అరెస్టు చేసి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేసే క్రమంలో పోలీసులకు టిడిపి నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది, విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యానికి నేరుగా వెళ్లి దాడి ఘటన గురించి కంప్లైంట్ ఇచ్చిన యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం నాయకులు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అయిదు రోజులుగా డిమాండ్ల సాధన కోసం అంగన్ వాడీలు చేస్తున్న పోరాటానికి శనివారం ఉదయం ఆయన కనేకల్లులో సంఘీభావం ప్రకటించారు. అక్కడ వారి దీక్ష శిబిరానికి ఆ పార్టీ నాయకులతో వెళ్లారు. వారి పోరాటానికి ఆది నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. రానున్న తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను తీరుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు కూడా స్పష్ఠమైన హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2019లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాల కంటే ఏపీలో అంగన్వాడీలకు మెరుగైన జీతాలు ఇస్తానని నమ్మబలికాడన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన వేతనాలనే ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం ఇస్తోందన్నారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా, అంగన్వాడి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడానికి ఎందుకు శ్రద్ధ చూపలేదని కాలవ సూటిగా ప్రశ్నించారు. వారు అడుగుతున్న డిమాండ్లు సహేతుకమైనవి, న్యాయబద్దమైనవి అని ఆయన అభిప్రాయపడ్డారు. వారు నిరసన తెలుపుతుంటే వైసిపి ప్రభుత్వం దుర్మార్గంగా సెంటర్ల తాళాలు పగలగోడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5రోజుల పాటు అంగన్వాడిలు న్యాయబద్దంగా పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్లుగా లేకపోవడం బాధ్యతరహితమన్నారు. అంగన్వాడిల సమస్యల్ని తీర్చడానికి చేతకాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమానవీయంగా సెంటర్లను స్వాధీనం చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.