అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లోని ఓ భవనంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని పార్టీ నాయకులు ముత్యాల కిషోర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు కలిసి ప్రారంభించడం జరిగింది. పూజా కార్యక్రమాలు నిర్వహించి, నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని శుభాభివందనం తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఈ నూతన కార్యాలయం ప్రారంభించడం రైల్వే కోడూరు మండల కార్యకర్తలకు, నాయకులకు మంచి శుభ సూచికమని రాబోయే ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మాటే శిరోధరంగా భావించి ముందుకు వెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు, దిశా నిర్దేశం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు కూడా పాల్గొనడం జరిగింది.
Tdp
అంగన్వాడి ఉద్యోగుల ఆందోళనలకు కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మద్దతు తెలియజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, గత 4 రోజులుగా అంగన్వాడి ఉద్యోగులు కందుకూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటూరి నాగేశ్వరరావు గురువారం మధ్యాహ్నం దీక్ష శిబిరానికి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పేద బలహీన వర్గాల చిన్నారులు ఎక్కువగా వెళ్లే అంగన్వాడీ కేంద్రాలలో, టీచర్లు, ఆయాలు, హెల్పర్లు చాలా చక్కగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అయినప్పటికీ వారి సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు అంగన్వాడీ సిబ్బందికి అధిక శాతం జీతాలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎన్నికలకు ముందు అనేక మోసపూరిత మాటలు చెప్పి వీళ్లందరి చేత ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి, తర్వాత పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ జీతం ఇస్తానన్న ముఖ్యమంత్రి, ఒక్కసారి వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి అక్కచెల్లెమ్మలను మోసం చేశారని అన్నారు. 10 వేలు ఆదాయం దాటిన సిబ్బందికి ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తున్నారని అన్నారు. జీతాలు, బిల్లులు సకాలంలో విడుదల చెయ్యలేని దీనస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉందని, పైగా ఇతర శాఖల ఉద్యోగులను కూడా వారిపై ఉసిగొలిపి రకరకాలుగా బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం సిబ్బంది నిరసన తెలుపుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఉద్యోగుల చేత బలవంతంగా కేంద్రాలు తెరిపించిందని, ఇలా ఎన్నాళ్లు బెదిరిస్తారని ప్రశ్నించారు.
అంగన్వాడి ఉద్యోగుల ఆందోళనకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ డిమాండ్లన్నీ తప్పక పరిష్కరిస్తామని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, నాయకులు చిలకపాటి మధుబాబు, రాయపాటి శ్రీనివాసరావు, రెబ్బవరపు మాల్యాద్రి, పొడపాటి మహేష్, షేక్ మున్నా, చుండూరి శీను, షేక్ రూబీ, షేక్ ఫిరోజ్, సయ్యద్ గౌస్ బాషా, సయ్యద్ అహ్మద్ భాష, పులి నాగరాజు, బద్దిపూడి శిఖామణి ఇతర నాయకులు పాల్గొన్నారు..
పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగు యువత పల్నాడు జిల్లా అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మేత కోటిరెడ్డి మాట్లాడుతూ ఏపీలో చదువుకున్న విద్యార్థులను సీఎం జగన్ దారుణంగా మోసం చేశారు అనీ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని ఎన్నికల ముందు చెప్పారు. జాబ్ క్యాలెండర్ సంగతి ఏమో కాని ప్రతి ఏడాది సాక్షి క్యాలెండర్ మాత్రo విడుదల చేస్తున్నారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాన్నాము అని దొంగ పత్రిక ప్రకటన విడుదల చేస్తారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగులు ఈ రోజు సీఎం జగన్ ని ఒక ద్రోహిగా చూస్తున్నారు. మన రాష్ట్రం నిరుద్యోగ సమస్యలో దేశంలోనే నంబర్ వన్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే చాలా తోలగించారు అని నిరుద్యోగుల ఆత్మహత్యలు చూసైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు.
తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష నాయకులు నరసరావుపేటలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని హెచ్చరించారు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుఫాన్ వల్ల నష్టాన్ని అంచనా వేయలేని వ్యవసాయ అధికారులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు చేతకాని వీళ్ళందర్నీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. సకాలంలో మళ్లీ రెండో పంట వేసుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా రైతులు రైతు బిడ్డల కన్నీళ్లను తుడవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో వర్షాలు లేక వర్షాభావ పరిస్థితి లేక ఒకవైపు సాగర్ ఆయకట్టకు నీళ్లందకా మరొకవైపు దశాబ్ద కాలంగా రైతులు అవస్థలు పడుతున్నారు. దీనికోసం తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టింది. వరికపూడి శాల ప్రాజెక్టుకి ప్రభుత్వం దిగిపోయే సమయంలో ప్రజల్ని మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు. ఈ ప్రాంతంలో ఉన్న రొంపిచర్ల మరియు శావల్యాపురం పరిసర కీలక మండలాలలో తొలిపంట వేయటం మానేసి చాలా సంవత్సరాలు అయింది. రెండో పంటగా ఉన్న శనగ, మినుము లాంటి పంటలు వేస్తే మొన్న వచ్చిన తుఫాను ఆ పంటలను మొలకలోనే మునిగిపోయి కుళ్ళిపోయేటట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ముఖ్యమంత్రి తుఫాను బాధిత రైతుల పర్యటన అదేదో చంద్రబాబు నాయుడుని, సిపిఐ పార్టీని చూసి రోడ్డు మీదకు వచ్చి మొక్కుబడిగా క్రికెట్ ఆట చూడటానికి టెంటు వేసుకున్నట్లు ఉంది తప్ప అది రైతుల కష్టాలను చూసే పద్ధతి లాగా లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆయన మీద ఉన్న కేసులు, బెయిల్ నుంచి రక్షణ పొందడానికి తప్ప ఈ రాష్ట్ర రైతాంగాన్ని ,దళితులను, గిరిజనులను, బీసీలను, మైనార్టీలను మొత్తంగా రాష్ట్ర ప్రజలను కాపాడడానికి కాదని ఆయన పదే పదే చెప్తున్నాడు. ప్రజలకు కూడా ఇప్పుడు బాగా అర్థమైంది అందువల్ల ముఖ్యంగా అఖిలపక్షాలు టిడిపి, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, జనసేన, ఎంఐఎం ఇతర ప్రజా సంఘాలు ఐక్యంగా సాధారణ పంట ధాన్యంకి ఎకరాకు 40000 ఇవ్వాలి, వాణిజ్య పంటలకు 75000 ఇవ్వాలి, ఉద్యాన పంటలకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఈ ప్రకారం ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నామన్నారు.
మిచాంగ్ తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని గురించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. మిచాంగ్ తుఫాన్ తో కనీవినీ ఎరుగని నష్టం జరిగిందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు. ముందస్తుగా తుఫాన్ హెచ్చరికలు చేసినా ప్రభుత్వం శ్రద్ద తీసుకోలేదని, పట్టిసీమను వాడుకోవడం వల్ల తుఫాన్ ల కంటే ముందుగానే పంట చేతికొచ్చేదని ఆయన మండిపడ్డారు. పట్టిసీమ, పులిచింతల ను పట్టించుకోలేదని, వైసీపీ వచ్చిన తర్వాత ఇరిగేషన్ ను నాశనం చేశారని అన్నారు. డ్రెయిన్ ల పూసికతీత తీయకపోవడం తో పొలాల్లో నీరు బయటకు వెళ్ళలేదని సీఎం, మంత్రులు తుఫాను పై స్పందించడం లేదని ఆయన ఎద్దేవా చేసారు. తుఫాన్ నష్టంపై రైతులకు భరోసా ఇవ్వడం లో ప్రభుత్వం ఫెయిల్ అయిందని కరువు, తుఫాన్ నష్టంపై కేంద్రాన్ని ఒక్క రూపాయి కూడా అడగలేదని అన్నారు. నా రాజకీయ చరిత్రలో చూడనంత నష్టం జరిగిందని బాధితులకు న్యాయం చేసేవరకూ టీడీపీ తరపున పోరాడతానని ఆయన అన్నారు. కరువు, తుఫాన్ నష్టంపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాన్నారు. వచ్చేది రైతు ప్రభుత్వమని, రైతులను ఆదుకుంటామని, అంగన్వాడీల న్యాయమైన పోరాటానికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారని అన్నారు.
ఓటమి భయంతో జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జిలను మారుస్తున్నారు కానీ ప్రజలే జగన్ మోహన్ రెడ్డిని మార్చే రోజులు దెగ్గరలో ఉన్నాయని కొనకళ్ల నారాయణరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని పాయింట్లను చెప్పారు.
1) జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. అందుకే అభ్యర్థులను మార్చుతున్నారు.
2) నిన్న ప్రకటించిన 11 మంది ఇంచార్జుల్లో ఒక్కరూ కూడా గెలిచే పరిస్థితి లేదు.
3) ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నాయకులను మార్చినంత మాత్రాన జగన్ రెడ్డి తలరాత మారదు.
4) దగాకోరు జగన్ రెడ్డి పాపం పండింది. జగన్ రెడ్డి అవినీతి, అక్రమాల మీద ఇప్పటికే ప్రజలు పీకలు దాకా కోపంతో ఉన్నారు.
5) మన భవిష్యత్తుకు గ్యారెంటీతో వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపడం కూడా గ్యారెంటీ.
6) వైఎస్సార్సీపీ 11 మంది ఇంచార్జుల్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. స్థానికంగా వారిపైన వ్యతిరేఖత, అవినీతి ఆరోపణలు, ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణం.
7) ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వైఎస్సార్సీపీ ఇంచార్జుల మార్పుల పేరుతో కొత్త నాటకం ఆడుతోంది.
8) జగన్ రెడ్డి ఇంచార్జులను మార్చుతున్నారు… కానీ ఏపీ ప్రజలు ఏకంగా జగన్ రెడ్డినే మార్చేందుకు సిద్దంగా ఉన్నారు.
9) ఇప్పటి వరకు వైసీపీ నాయకులు చేసినదంతా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను దోచుకోవడం, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడం. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు ఆడిన వైసీపీ ప్రభుత్వం. అభివృద్ధి మాత్రం శూన్యం.
10) మంగళగిరిలో గెలుస్తారని తెలిసినప్పుడు సీటు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి ఓడిపోతారు అని తెలిసినప్పుడు మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి ఇచ్చారు.
11) బీసీల మీద జగన్ రెడ్డికి ఉన్న కపట ప్రేమకు ఇదే నిదర్శనం.
ఈ కార్యక్రమంలో మోటమర్రి బాబా ప్రసాద్ ,లంకె శేషగిరి ,గోపు సత్యనారాయణ ,బచ్చుల సుబ్రహ్మణ్యం (బోస్),బత్తిన దాస్ ,పీవీ ఫణి కుమార్ ,పామర్తి లక్ష్మణ్, చిల్లిముంత ప్రవీణ్ ,జనసేన నాయకులు భీమవరపు పరమేశ్వర రావు ,ఆళ్ల మాధవ ,బడే రమణ తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు పట్టణంలోని 6వ వార్డు కోటకట్ట మసీదు ప్రాంతంలో, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ఉదయం నిర్వహించారు. ముందుగా ఆ ప్రాంతంలోని ముస్లింలంతా, పెద్దఎత్తున తరలివచ్చి నాగేశ్వరరావు కి ఘనస్వాగతం పలికారు. నాగేశ్వరరావు పై పూలు చల్లుతూ అభిమానంతో ముంచేత్తారు. గతంలో ఎప్పుడూ గడపదాటని ముస్లిం మహిళలు కూడా నాగేశ్వరరావు ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లి, ఆయనను అందరికీ పరిచయం చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా మహిళలంతా జగన్ ప్రభుత్వంపై, స్థానిక వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కొంతమంది అధికార పార్టీ నేతలు తమకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారని, నోరు తెరిచి అడిగితే బెదిరిస్తున్నారని నాగేశ్వరరావుతో చెప్పారు. మేమంతా గతంలో వైసీపీకి ఓట్లు వేశాం. ఈ ప్రభుత్వం మాకేమీ చేయలేదు. సైడు కాలవలు శిధిలమై నీళ్ళు ముందుకు పోక కంపు, దోమలతో అల్లాడిపోతున్నాం. కనీసం అవి బాగు చేయడానికి కూడా వైసిపి నాయకులకు చేతకావడం లేదు. ఎన్నికలకు ముందేమో పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తాం అని చెప్పారు. ఓట్లు వేయించుకున్న తర్వాత, తక్కువమందికి పట్టాలిచ్చి, ఇల్లు మీరే కట్టుకోవాలని చెబుతున్నారు. ఇల్లు కట్టుకోకపోతే పట్టాలు తిరిగి ఇచ్చేయాలని బెదిరిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమానికి వెళ్ళకూడదంటూ మూడు రోజులుగా తమపై వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని మహిళలు తెలిపారు. ఒకవేళ కార్యక్రమానికి వెళితే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని ఉదయం కూడా తమను బెదిరించారని చెప్పారు. ఈసారి వైసీపీకి ఓటు వేసే ప్రసక్తే లేదని, ఇంటూరి నాగేశ్వరరావుకి మద్దతుగా నిలిచి, ఆయన్ను అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలందరికీ స్థలాలు కేటాయించి, ఇల్లు కట్టించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అలాగే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. మీకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా తమకు తెలియజేయాలని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను గమనించి, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని నాగేశ్వరరావు కోరారు. కందుకూరులో అందరికీ ఆమోగ్యమైన పరిపాలన రావాలంటే వైసీపీని ఓడించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ బాషా, వార్డు నాయకులు షేక్ ఫిరోజ్, షేక్ మున్నా, షేక్ మియాజాన్, షేక్ దావూద్ బాషా, షేక్ నాయబ్ రసూల్, సయ్యద్ అహ్మద్, షేక్ రియాజ్, షేక్ సలీం, షేక్ అబ్దుల్లా, షేక్ సంధాని, షేక్ జిలాని, షేక్ సుభాని, షేక్ నిషాహీద్ నాయకులు కండ్రా మాల్యాద్రి, చదలవాడ కొండయ్య, చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, వడ్డెళ్ల రవిచంద్ర, బెజవాడ ప్రసాద్, గోచిపాతల మోషే, రాయపాటి శ్రీనివాసరావు, రెబ్బవరపు మాల్యాద్రి, పొడపాటి మహేష్, చుండూరి శీను, షేక్ సలాం, సయ్యద్ జియావుద్దీన్, రూబీ, గౌస్ బాషా, కరిముల్లా, షేక్ ఖలీల్, సవిడిబోయిన వెంకటకృష్ణ, ముచ్చు వేణు పులి నాగరాజు, ఫాజిల్, చంటి, బద్దిపూడి శిఖామణి, మమ్ముషా, వేముల ప్రసాద్, ముప్పవరపు వేణు గుమ్మ శివ, మచ్చ మనోహర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందని వైకాపా నాయకులు అన్ని రకాలుగా దోచుకుంటున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని 15 వ వార్డులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంను నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మోసపూరిత పథకాలతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని చెప్పారు. ప్రభుత్వ పెద్దలకు ముందు చూపు లేకపోవడంతో విద్యుత్తు సమస్య నెలకొందన్నారు. తెదేపా అధికారంలోనికి వస్తే అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా నీటమునిగిన పంటపొలాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇంఛార్జి వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో టిడిపి బృందం పరిశీలించారు. వరి, అరటి రైతులతో పంట నష్టాన్ని గురించి చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చిక్కాల రామచంద్రరావు,బోళ్ల వెంకటరమణ,నియోజకవర్గ ఇంఛార్జి వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధికారులు అంచనా వేసిన పంటనష్టం కంటే ఎక్కువే ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హుద్ హుద్, తిత్లీ, హరికేన్ తుఫాన్ల సమయాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించి వెంటనే న్యాయం చేసారని గుర్తు చేశారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అన్ని రకాల పంటలకు తగిన నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం, మానుకొండవారిపాలెంలో తుఫాన్ కు దెబ్బతిన్న శనగ, పొగాకు, మిరప, వరి కల్లాలను తెదేపా రాష్ట్ర బృందంతో కలిసి మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అనంతరం రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ రైతుకు భరోసా కల్పించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇప్పించేందుకు వచ్చామన్నారు. అన్నదాత కష్టాల్లో ఉంటే దెబ్బతిన్న పంటల పరిశీలనకు చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత జగన్రెడ్డి కదిలారని మండిపడ్డారు. ఎక్కడా కూడా పొలాల్లోకి దిగిన దాఖలాలు లేవన్నారు. కాలికి మట్టి అంటకుండా తిరిగితే రైతుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. పంట నష్టపోయి అన్నదాతలు నిద్రల్లేని రాత్రులు గడుపుతుంటే జగన్కు ఎవరిని ఎక్కడికి మార్చాలి.. మళ్లీ అధికారంలోకి రావాలనే ధ్యాస తప్ప మరొకటి లేదన్నారు. ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారో ప్రకటనే చేయలేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఈ-క్రాపింగ్ ఎంత బుక్ చేశారో కూడా చెప్పడం లేదని… ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వమో అర్థం కావడం లేదన్నారు. పంట దెబ్బతిన్న 22 లక్షల ఎకరాల్లో ఈ-క్రాపింగ్ బుకింగ్ ఎంత వస్తుంది.. రాని వారికి, కౌలుదార్లకు ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందనే వాటిపైనా ఏమీ చెప్పలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్రాంతి లోపు చెల్లిస్తామని చెబుతున్నారని.. ఈలోపు ఇవ్వకపోతే జనవరి 20 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చి జగన్రెడ్డి తప్పించుకునే అవకాశం ఉందన్నారు. కాబట్టి తక్షణమే రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని, తడిసినధాన్యం, మిరప కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే వైకాపాలో అభ్యర్థుల మార్పులపైనా చురకలు వేశారు. చెల్లని రూపాయి ఎక్కడ ఉన్నా చెల్లనిదే అని అన్నారు. స్థానాలు మార్చినంత మాత్రాన వాళ్ల అవినీతి, అక్రమాల చరిత్రలు చెరిగిపోవు అన్నారు. చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని చేసిన అవినీతి, దుర్మార్గాల్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడుగురిని మార్చారని.. అభ్యర్థులను మార్చినంత మాత్రానా వారు చేసిన అవినీతి, దుర్మార్గాలు ఎక్కడిపోతాయని ప్రశ్నించారు.