అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లోని ఓ భవనంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని పార్టీ నాయకులు ముత్యాల కిషోర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు కలిసి ప్రారంభించడం జరిగింది. పూజా కార్యక్రమాలు నిర్వహించి, నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని శుభాభివందనం తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఈ నూతన కార్యాలయం ప్రారంభించడం రైల్వే కోడూరు మండల కార్యకర్తలకు, నాయకులకు మంచి శుభ సూచికమని రాబోయే ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మాటే శిరోధరంగా భావించి ముందుకు వెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు, దిశా నిర్దేశం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు కూడా పాల్గొనడం జరిగింది.
నూతన ప్రారంభోత్సవం….
260
previous post





Total views : 79746