తెలంగాణ రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం ఇన్చార్జ్ మంత్రులను నియమించింది. వరంగల్కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కరీంనగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి, రంగారెడ్డి – శ్రీధర్ బాబు, హైదరాబాద్ – పొన్నం ప్రభాకర్, మెదక్ -కొండా సురేఖ, ఆదిలాబాద్ – సీతక్క, నల్లగొండ – తుమ్మల నాగేశ్వర్ రావు, మహబూబ్నగర్ – దామోదర్ రాజనర్సింహ, నిజామాబాద్ – జూపల్లి కృష్ణారావులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా నియమించబడ్డ మంత్రులు ఆయా జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాల పంపిణీని పర్యవేక్షించనున్నారని ఉత్తర్వుల్లో తెలిపారు. కాగా, సంక్షేమ పథకాల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా మంత్రులకు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఏ జిల్లా మంత్రికి కూడా సొంత జిల్లా బాధ్యతలను అప్పగించలేదు. దీని ద్వారా సంక్షేమ పథకాల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా. కేవలం లబ్ధిదారులకు మాత్రమే ఫలాలు అందుతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Tag:
telangana cabinet ministers
తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు. మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ, ఇంధన శాఖ కేటాయింపు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచార శాఖ, రెవెన్యూ, గృహ నిర్మాణం. దామోదర్ రాజనర్సింహకు ఆరోగ్యశాఖ. సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ. ఉత్తమ్ కుమార్ కు సివిల్ సప్లై , ఇరిగేషన్ శాఖ కేటాయింపు. జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ శాఖ , పర్యాటక శాఖ. దుదిల్ల శ్రీధర్ బాబుకు ఐటీ , పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ. తుమ్మల నాగేశ్వరరావు కు వ్యవసాయ శాఖ, చేనేత, టెక్స్ టైల్స్. కొండ సురేఖకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ. కోమటిరెడ్డికి ఆర్ అండ్ బి శాఖ, సినిమా టోగ్రఫీ.





Total views : 79446