రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని మూలవాగు పరిసర ప్రాంతంలో ఇద్దరు యువతీ, యువకుడు అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. సంఘటన స్థలానికి కోనరావుపేట పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.. అయితే యువకుడిది కనగర్తి గ్రామానికి చెందిన వాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
telangna news
అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలీస్, పి.ఓ పోలింగ్ అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు జిల్లాలోని 15 నియోజకవర్గాలలో ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలలో ఎన్నికల విధులు నిర్వహించే పి.ఓ లు, ఏ.పి.ఓ లు, ఇతర పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఆయా నియోజకవర్గాల్లో సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీసు అధి కారికారులు, సిబ్బంది ఆయా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించారు. అదే విధంగా కార్వాన్ నియోజకవర్గం గోల్కొండ తహశీల్దార్ కార్యాలయం, చార్మినార్ నియోజకవర్గం మొఘల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్, బహదూర్ పుర నియోజకవర్గం బహదూర్ పుర తహశీల్దార్ కార్యాలయం ఫెసిలిటేషన్ సెంటర్ లలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను పరిశీలించారు.





Total views : 79278