తిరుచానూరులో కొలువుదీరి వున్న శ్రీ పద్మావతి దేవి తెప్పోత్సవాలలో నాలుగవ రోజు పద్మ సరస్సులో తెప్పలపై వూరేగారు. పద్మావతి దేవి ఉద్భవించిన పద్మ సరోవరంలో పాహి హరిప్రియ అలిమేలు మంగమ్మ కన్నుల పండువుగా ఐదు చుట్లు వూరేగి భక్తులకు అభయమిచ్చారు. ప్రతి యేట జ్యేష్ట మాసంలో 5 రోజుల పాటుగా అమ్మవారికి తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితి. అందులో భాగంగా నీటిపైన తేలియాడే తెప్పలలో అమ్మవారు రోజుకొక వాహనంలో కన్నుల పండుగా అమ్మవారిని వూరేగిస్తారు. సిరుల తల్లి అలిమేలుమంగమ్మ జలవిహారం మిరుమెట్లు గొలిపే రంగురంగుల విద్యుద్దీప అలంకరణలో సాగింది. అమ్మవారు అభయవరధహస్తాలతో భక్తులను కరునిస్తూ జలవిహారం సాగించారు.
శ్రీనివాసుని దేవేరి పద్మావతమ్మ దివ్య దర్శనానికి వేలాదిమందిగా భక్తులు తరలివచ్చారు.
Tag:




Total views : 180098