వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి లో పరువు హత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుడి బంధువులు ఆగ్రహంతో ఉప్పరపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సినపెల్లి భాస్కర్, నిఖిత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇరువురు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావటంతో మూడేళ్ల క్రితం నికితకు వేరే యువకుడితో వివాహం జరిపించారు. నిఖిత కి పెళ్లి ఇష్టం లేకపోవడం తో ఇటీవల విడాకులు తీసుకుంది. అయితే తన కూతురి కాపురం కూలిపోవడానికి భాస్కరే కారణమని కక్ష పెంచుకున్నాడు నికిత తండ్రి. హైదరాబాద్ మాదాపూర్ హాస్టల్ లో ఉంటున్న భాస్కర్ ను నికిత తండ్రి, మరికొందరుకలిసి దాడి చేసి దారుణంగా హతమార్చారు. భాస్కర్ దారుణ హత్యకు గురయ్యాడనే వార్త ఉప్పరపల్లి గ్రామానికి చేరడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన భాస్కర్ బంధువులు, దళిత సంఘాల నాయకులు ఉప్పరపల్లి లో రోడ్డు వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు అవాంఛనీయ ఘటనలు ఏవీ జరగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా గ్రామంలో భారీగా బలగాలను మోహరించారు.
Tag:





Total views : 212170