పశ్చిమగోదావరి జిల్లా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొల్లు నియోజకవర్గం లో తడిసిన, నష్టపోయిన ధాన్యం రాశులను, కుండాపోతగా . కురుస్తున్న వర్షం లోనే mla రామానాయుడు తడుస్తూ పర్యటించారు. వర్షానికి తడుస్తున్న ధాన్యం రాశులను కాపాడుకుంటున్న రైతులతో కలిసి ఆయన పారపట్టారు. తడిసిన, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యం ను ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం ఎక్కడికి అక్కడే ఓబ్బిడి జరిగేలా కొనుగోలు చేయాలి. భారీ వర్షాలకు కల్లాలపై ఉన్న ధాన్యం రాశులు తడిసిపోయాయి. వరిచేలు నేలకోరిగాయి. ధాన్యం కొనుగోలులో తేమశాతం నిబంధనల సడలింపు వారం రోజుల కిందటే ప్రభుత్వం తీసుకొని ఉంటే రైతాంగం నష్టపోయేవారు కాదు.తుఫాను ప్రభావం కోస్తా ప్రాంతంలో తీవ్రంగా ఉంటుందని పది రోజుల కిందటే వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. తుఫాను ఉపద్రవం ముంచుకొచ్చిన తర్వాత ప్రభుత్వం తేమ శాతం నిబంధనలు సడలించడం, ప్రత్యేక అధికారులను నియమించడం వలన జరిగిన నష్టాన్ని తీర్చలేము. తుఫాను ప్రభావ ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందువలనే రైతులతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఇతర వ్యవసాయ రైతులు తీవ్రంగా నష్టపోయారు..
west godhavari district news
మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లాలోని కోత కోసి పనలపై ఉన్న వరి పంట పూర్తిగా నీటి మునిగి పోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లాలోని వందలాది ఎకరాల వరి పంట తడిసి ముద్దయింది. ఏలూరు మండలంలోని మల్కాపురంలో పనల మీద ఉన్న వరి పంటను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. పనల మీద ఉన్న పంట తడిసి పోవడంతో మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, అందువలన అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని రైతు సంఘం నాయకుడు శ్రీనివాస్ కోరారు. ధాన్యం కోనుగోలులో ఆంక్షలను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సకాలంలో వాహనాలు ఏర్పాటు చేయకపోవడం వలన కల్లాల్లో ధాన్యం ఉండిపోయిందని చెప్పారు. పంట చేతికి వచ్చే సమయంలో వచ్చిన తుఫాను… అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసిందని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల స్థానిక మున్సిపాలిటీ కార్యక్రమానికి భాగంలో రిపేరుకు వచ్చి పక్కన పెట్టిన మోటార్ వెహికల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. సిబ్బంది ఇటీవల కాలంలో పట్నంలో తొలగించిన ఫ్లెక్సీలను తగులు పెట్టేందుకు మంటలు వేయగా ఆ మంటల్లో రిపేరుకు వచ్చిన వాహనాలు తగలబడిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మున్సిపాలిటీ ఆస్తులను సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బూడిద పాలు అవుతున్నాయని పట్టణంలోని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ కార్యదర్శి, సిబ్బందిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు
శివనామస్మరణతో మారుమోగుతున్న శివక్షేత్రాలు. ఈరోజు కార్తీక కార్తీక పౌర్ణమి కావడంతో శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక విశిష్ట అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి లోని ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం విశిష్టమైన క్షేత్రం. ఇక్కడ చంద్రుడే స్వయంగా స్వామివారి లింగాన్ని ప్రతిష్ఠించాడని ఇక్కడ స్వామివారు లింగం రంగులు మారుతుంది. సోమేశ్వర స్వామి లింగం పౌర్ణానికి శ్వేత వర్ణం తెలుగులోనూ అమావాస్య ముదురు గోధుమ రంగు లోనికి మారుతుంది. చంద్రుడు ప్రతిష్టించిన స్వామిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల గాఢ విశ్వాసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారి పక్కన పార్వతి దేవి స్వామివారి శిరస్సుపై భాగంలో అన్నపూర్ణమ్మ అమ్మవారు కొలువై ఉండటం ఈ ఆలయ విశిష్టత. ఈ కార్తీక మాసంలో పంచారామ యాత్రలో భాగంగా స్వామి వారిని భారీగా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు దర్శించుకుంటారు. కార్తీక మాసం భక్తులకు నిత్య అన్నదానం పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆలయ అధికారులకు మరియు పోలీస్ సిబ్బంది సహకారంతో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు దేవస్థానం కార్యవర్గ సభ్యులు.
కార్తీక సోమవారం , పౌర్ణమి కలిసి రావడంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరిలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో పట్టణంలోని వలందర్, అమరేశ్వర రేవులు కిటకిటలాడుతున్నాయి. పవిత్ర నది లో స్నానం ఆచరించిన భక్తులు గట్టుపై కుటుంబ సమేతంగా కార్తీక దామోదర పూజలు చేసుకుని నదిలో దీపాలు విడిచిపెట్టారు. ఇటు పట్టణంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అభిషేకాలు చేయించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూ కట్టారు.





Total views : 78245