భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ హైడ్రోజన్ రైలు ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ సెక్షన్లో నడుస్తుంది. 89 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. 10 కోచ్లతో ఈ రైలును అందుబాటులోకి తెచ్చారు.
జింద్- సోనిపత్ మధ్య రెండు ట్రిప్పుల ద్వారా ప్రతిరోజూ సుమారు 356 కిలోమీటర్లు సర్వీసులు అందించనుంది. గంటకు 75 కి.మీ నుండి 120 కి.మీ.సామర్థ్యంతో నడుస్తుంది. ఇందులో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, 8 ప్యాసింజర్ కోచ్లతో సహా మొత్తం 10 కోచ్లు అందుబాటులో ఉన్నాయి. 2600 మంది ప్రయాణికులు ఒకేసారి వెళ్లవచ్చు. ఈ కోచ్లు చాలా లగ్జరీగా ఉంటాయి. అయితే కేవలం నాన్ ఏసీ కోచ్లు మాత్రమే ఇందులో ఉంటాయి. ప్రపంచంలో ఇతర దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు ఉండగా.. ఇంత పొడవైన రైలు ఎక్కడా లేదు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తున్న దేశంగా భారత్ నిలవనుంది. రైల్వే రంగంలో ఇది సరికొత్త విప్లవంగా చెప్పవచ్చు.




Total views : 212575