రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మునిసిపల్ కార్మికులు మోకాళ్ళ దండ వేసి నిరసన తెలిపారు. స్థానిక లైబ్రరీ సెంటర్ వద్ద టెంట్ వేసి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారం లోకి రాకముందు తమను శాస్విత ప్రాతిపదికన నియమిస్తామని హామీ ఇచ్చిందని కానీ అధికారం లోకి వచ్చి 5 వ ఏడు పూర్తి కావస్తున్నా హామీలు నెరవేర్చలేదని అన్నారు. హామీకి విరుద్ధంగా అప్కాస్ అనే శాస్విత కాంట్రాక్టు వ్యవస్థను తమ పైన రుద్దిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే తాము ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.
workers
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లా సిల్క్యారా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగా ఉన్నట్లు తేలింది. శిథిలాల నుంచి 53 మీటర్ల మేర చొప్పించిన 6 అంగుళాల పైప్లో వాకీటాకీలు జత చేసిన ఎండోస్కోపీ కెమెరాతో రికార్డు చేసిన వీడియోను అధికారులు విడుదల చేశారు. తెల్లవారుజామున తీసిన ఈ వీడియోలో కూలీలు పసుపు-తెలుపు రంగులోని హెల్మెట్లు ధరించి, ఒకరికొరు మాట్లాడుకుంటూ పైప్ నుంచి వచ్చిన ఆహార పదార్థాలను అందుకోవడం కనిపించింది. అధికారులు స్ర్కీన్పై గమనిస్తూ, లెన్స్ను శుభ్రం చేయాలని, కెమెరా ముందుకు రావాలని కోరారు. పైప్ సమీపానికి వచ్చి వాకీటాకీలో మాట్లాడాలని సూచించారు. తామంతా క్షేమంగానే ఉన్నామంటూ కూలీలు సంకేతాలిచ్చారు. కాగా, ప్రధాని మోదీ కూడా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామికి ఫోన్ చేసి సహాయక చర్యల పురోగతిని తెలుసుకున్నారు. మరోవైపు అధికారులు సొరంగంపై నిలువునా డ్రిల్లింగ్ చేయడంపై దృష్టిసారించారు. దీనికి ఎంత సమయం పడుతుందనేది మాత్రం చెప్పడం లేదు. సొరంగం ముఖద్వారంలో టీబీఎంను వినియోగిస్తున్నారు. చిన్న యంత్రాన్ని వాడేందుకు వీలుగా టన్నెల్ ప్రారంభాన్ని వెడల్పు చేసేందుకు పేలుడు జరపాలని యోచిస్తున్నారు. బార్కోట్ నుంచి మూడు మీటర్ల వ్యాసంతో బ్యాకప్ రూట్ నిర్మాణం ప్రారంభించారు.
Read Also..
Read Also..
సంగారెడ్డి జిల్లా సదాశివపేట MRFకంపెనీలో కార్మికుల మధ్య గొడవ చోటుచేసుకుంది. వేజ్ అగ్రిమెంట్ విషయంలో యూనియన్ అధ్యక్షుడు ఉగ్గేలి రాములు, కార్మికుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారింది. చివరకు కార్మికులకు, యూనియన్ అధ్యక్షుడి మధ్య ఘర్షణ కు దారితీసింది. ఈ ఘర్షణలో ఉగ్గేలి రాములు తలకు గాయమైంది. గాయపడిన యూనియన్ నాయకుడిని ఆస్పత్రికి తరలించారు. ఘర్షణ విషయం తెలుసుకుని కార్మికులు కంపెనీ వద్దకు చేరుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులను అదుపు చేశారు.





Total views : 199254