కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో తగ్గని పేదరికం.. APలో CMజగన్ నాలుగేళ్ల పాలనలో తగ్గిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ‘వర్షమొస్తే HYDలో అన్నీ కొట్టుకుపోతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ఇక వర్కౌట్ కాదు. రైతుల నుంచి బియ్యాన్ని కొనలేకపోతున్నామన్న కేసీఆర్ వ్యాఖ్యలు తప్పు. APలో పండుతున్న సన్నబియ్యాన్నే ఎక్కువ ధరకు కొని TS వాళ్లు తింటున్నారు. 3 రాజధానుల విజన్లో APని అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు.
ycp
ఏలూరు జిల్లా పోలవరంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్ ను సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనవసరమని ఎగతాళి చేసి మేము అధికారంలోకి వస్తే మోటర్లు పీకేస్తామని ప్రహబ్బాలు పలికిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కృష్ణ డెల్టాకు సాగునీరు అందుతుందంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేనిని ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి ప్రాజెక్టులను ఎగతాళి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
ప్రొద్దుటూరు టీడీపి నేత నందం సుబ్బయ్య భార్య అపరాజిత మీడియా సమావేశం. ప్రొద్దుటూరు వైసిపి నాయకులు తనను అసభ్యంగా మాట్లాడుతున్నారు. మూడేళ్ల క్రితం నా భర్త నందం సుబ్బయ్యను వైసిపి ఎమ్మెల్యే బావమరిది బంగారు రెడ్డి హత్య చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రోత్సాహించడంతోనే బంగారు రెడ్డి తన భర్తను చంపారు. బంగారు రెడ్డి చేసే దందాలు, భూ కబ్జాలు బయట పెడతారనే నందం సుబ్బయ్యను చంపారు. నందం సుబ్బయ్యను చంపినట్టే చంపుతామని వైకాపా నాయకులు అందరినీ బెదిరిస్తున్నారు. నా భర్తను చంపిన వాళ్ళు జైల్లో ఉండాలని ప్రతిరోజూ ప్రార్థిస్తున్నా. నందం సుబ్బయ్య హత్య కేసులో ఉన్న బెనర్జీ వైసీపీ నేతలతో ఎందుకు తిరుగుతున్నాడు. నందం సబ్బయ్యను చంపినట్టు చంపుతామని బెనర్జీ అందరినీ బెదిరిస్తున్నారు. ఇటీవల వైసిపి కార్యకర్త బెనర్జీ పై దాడి జరిగితే ఎలాంటి సంబంధం లేని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పై కేసు నమోదు చేయడం దారుణం. వచ్చే ఎన్నికల్లో టీడీపి గెలుస్తుంది…నా భర్తను చంపిన వాళ్ళు జైలుకెళ్ళడం ఖాయం…
ఇదివరకే పలు వివాదల్లో చిక్కుకున్న జీవితా రాజశేఖర్.. ఇప్పుడు పలు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అయితే అందుకు బదులుగా సమాధానమిస్తూ.. తనకు వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని నటి జీవితా రాజశేఖర్ అన్నారు. ప్రస్తుతం పలు మీడియాల్లో సర్క్యులేట్ అవుతోన్న తన ఫోటోలు పాతవేనని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు బీజేపీతోనే ఉన్నట్లు తెలిపారు. వ్యూహం అనే సినిమా రివ్యూ కమిటీకి వచ్చినప్పుడు అన్ని సినిమాల్లాగే దాన్నీ చూస్తానన్నారు. అయితే తనకు ఆఫీస్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు.
గంగవరం మండలంలో జగనన్నకు చెబుదాం రా అనే కార్యక్రమాన్ని ఎస్ఎల్బీ కళ్యాణమండపం లో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ముఖ్య అతిథులు నాయకులు ప్రజల సమస్యలను తీర్చడం మా ప్రధాన అంశం. టోల్ ప్లాజా నెంబర్ 1902 కాల్ చేస్తే మీ పరిష్కారం అంటూ నాయకులు తెలుపుతున్నారు. స్పందన కార్యక్రమంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా జగనన్నకు చెబుదాం రా అనే కార్యక్రమంలో ప్రజల సమస్యలు తీరుస్తామని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ జెడ్పీ శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు చెప్పారు.
రాహుల్ గాంధీపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ బలం రాహుల్ కు తెలియదని. తమ బలాన్ని చూసి ఇందిరాగాంధీనే సలాంకు వచ్చిందన్నారు. రాహుల్ గాంధీకి తామంటే ద్వేషంమని అన్నారు. రాహుల్ గాంధీ సహితులైన సింధియా, జితిన్ ప్రసాద్ వంటి పలువురు బిజెపిలోకి చేరారని. వారంతా డబ్బుల కోసమే బీజేపీలోకి వెళ్లారా అంటూ ప్రశ్నించారు. వారి పైన ఆరోపణలు చేయరు కానీ… తన పైన మాత్రం.. డబ్బుల కోసం పని చేస్తున్నట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను అసదుద్దీన్ ఓవైసీ కావడం.. గడ్డం టోపీతో ఉండడటమే కారణమా అంటూ ప్రశ్నించారు.
తన నివాసంపై గుర్తుతెలియని దుండగుల దాడి విషయంలో గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ స్పందించారు. మతి స్దిమితం లేని వ్యక్తి, మద్యం మత్తులో చేసిన చేష్టలుగా పోలీసులు చెప్పారంటూ.. పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు.. పోలీసులు చెప్పినది నిజమైతే హుందాగా వ్యవహరిస్తామని..అందులో నిజం లేకుంటే వైసిపి సత్తా ఏంటో చూపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు విడుదల సమయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో ప్రతి వ్యాఖ్యలు చేశారు.
కోర్టు నిబంధనల మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరకూ చంద్రబాబు కాన్వాయ్ సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. బాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తే ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రెడ్డి, వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఛీకొడుతున్నా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ రావటానికి చంద్రబాబుకు 16 గంటల సమయం పట్టింది. కోర్టు నిబంధనలు లేకపోతే ఇప్పుడు వచ్చినదానికంటే నాలుగు రెట్లు అధికంగా జనం వచ్చేవారు. చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించకుండా కారులోనే ఉండి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. లోకేశ్ ఢిల్లీ వెళితే వైసీపీ వాళ్లకెందుకు ఉలికిపాటు. అక్రమ కేసులో చంద్రబాబును 52 రోజులు నిర్బంధించారు. ఆయన అవినీతికి పాల్పడ్డట్టు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ అవకతవకలు జరిగాయంటూర మరో కొత్త కేసు పెట్టారు. వైసీపీ వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు.
వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన అప్పటి నుండి పార్టీలో తనకు గుర్తింపు లేదంటూ దిగిన పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణనికి చెందిన వైసీపీ ఎస్సి నేత కోట.ఆంజనేయులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 2011 నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనుక తిరిగి , పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన తనకి పార్టీలో సరైన గుర్తింపు లేదన్నారు. దాచేపల్లి పట్టణంలోని ఎస్సి కాలనిలో వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డితో ప్రారంభోత్సవం చేయించారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదంటూ దీక్షలో కూర్చున్న ఆంజనేయులు మరియు అతని కుటుంబ సభ్యులు.
సామాజికంగా వెనుకబడిన వర్గాలను ముందుండి నడిపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష అన్నారు. గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ఓట్ బ్యాంకుగా వాడుకొని వదిలేసేవారని అన్నారు. ఉదయగిరి పట్టణంలో వైసీపీ నేత మేకపాటి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష మాట్లాడారు. తొలుత పంచాయతీ బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా బహిరంగ సభ చేరుకున్నారు. సభలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికలలో ప్రతిపక్షాలు అడ్డొచ్చినా ముందుకు సాగుతామన్నారు. ర్యాలీలో భారీగా పాల్గొన్న కార్యకర్తలు, ప్రజలు సభ మధ్యలేనే వెళ్లిపోవటంతో సభ వెలవెలబోయింది.