దేశంలో మైనారిటీలకు ఏదైన లబ్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనతే అని అన్నారు సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి.శ్రీనివాస్. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో తమ రాజకీయ స్వలాభం కోసమే బి.జె.పి పార్టీ మైనారిటీలపై ఆంక్షలు విధించింది అని అక్కడ జరిగిన ఎన్నికల పర్యావాసనాలు చవి చూడక తప్పులేదని గుర్తు చేశారు. దేశంలో మైనారిటీలకు ఏదైన లబ్ధి చేకూరిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ చొరవే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వక్ఫబోర్డు ఆస్తుల రక్షణతో పాటు మైనారిటీ విద్యార్థులకు పూర్తి స్థాయి ఉచిత విద్యతో పాటు ఉన్నత చదువులు చదివేందుకు స్కాలర్ షిప్ లు అందిస్తామని అన్నారు. తెలంగాణలో అధికారం కోసం బి.జె.పి బి.ఆర్.ఎస్ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అన్నారు. మరో మారు ఆ పార్టీలకు అవకాశమిస్తే కేంద్రంలో బి.జె.పి రాష్ట్రంలో బి.ఆర్.ఎస్ ల చేతిలో చావుదెబ్బ తప్పదన్నారు.
Adilabad
మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో పొద్దున ఓ పార్టీ కండువా కప్పుకొని, ఇచ్చిన కమిట్మెంట్ సరిపోక కొద్ది గంటల వ్యవధిలోనే మరో పార్టీ కండువా కప్పుకొని ఆ గట్టునుంటావా,ఈ గట్టునుంటావా అన్న చందంగా తయారయ్యారు ఇక్కడి ఓటర్లు… తాజాగా చెన్నూర్ పట్టణానికి చెందిన టప్ప రాము స్థానికంగా మిర్చి బండి వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు..అయితే అతను గత కొద్ది రోజులుగా బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతూ వున్నాడు..అనూహ్యంగా బీజేపీ పార్టీలో నుండి వివేక్ వెంకటస్వామి గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రాము కొద్ది గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరకు సర్వోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీకి నినాదాలు చేసాడు..కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ 17 వ వార్డు కౌన్సిలర్ నాయిని శ్యామల భర్త సతీష్ రాత్రి కాంగ్రెస్ కండువా వేసుకొని తిరిగి తెల్లారే స్వంత గూటికి చేరిన విషయం మనకు తెలిసిందే…ఏది ఏమైనా కండువాల మార్పు కహానితో ఆయా పార్టీల అభ్యర్థులకు ఎవరు మనవారో,ఎవరు ఎటు పోతారో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు….
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రథం నుంచి ఆయన ముందుకు పడ్డారు. ఇదే సమయంలో వాహనంపై నుంచి సురేశ్ రెడ్డి, జీవన్ రెడ్డి నేలపై పడ్డారు. కేటీఆర్ కింద పడకుండా ఆయన గన్ మెన్లు గట్టిగా పట్టుకున్నారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓపెన్ టాప్ వాహనంపై వీరు ప్రయాణస్తుండగా వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడం వలన వాహనంపై ఉన్న రెయిలింగ్ ఊడిపోవడంతో వారంతా అదుపు తప్పి ముందుకు పడిపోయారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. తన ఆరోగ్యానికి ఏమి ప్రమాదం లేదని చెప్పారు. తరువాతి ర్యాలీకి కేటీఆర్ వెళ్లారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని వైన్స్, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్శాఖ యజమానులను అప్రమత్తం చేసింది.ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో ఈసీ ఆదేశాలను పాటించాలని సూచించింది. లేనిపక్షంలో లైసెన్స్లు రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది.
రాష్ట్రంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో జనం వణికిపోతున్నారు. ఉదయం చాలా చోట్ల పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వారం రోజులుగా సాధారణం కన్నా రెండు నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి పూట ఉష్ణోగ్రత తగ్గి, క్రమంగా చలి ప్రభావం పెరుగుతోంది. గత మూడు రోజులుగా సాయంత్రం 6 గంటల నుంచే చలి గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు పగటి పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉత్తర జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ.




Total views : 194234