తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపట్ల తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారని ఆరోపించారు. కరీంనగర్ లోనూ సర్కార్ వ్యతిరేక ఓట్లను చీల్చే కుట్ర జరుగుతోందన్నారు. కరీంనగర్ ప్రజలెవరూ మోసపోవద్దని, బీఆర్ఎస్ పాలనలో భూకబ్జాలు, డ్రగ్స్, కమీషన్ల దందాతో కరీంనగర్ అల్లాడుతున్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీల్లోని పేదవర్గాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.
Karimnagar
దేశంలో దివ్యాంగులకు అధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. దివ్యాంగులకు అండగా నిలిచింది కేసీఆర్. స్థానిక బిడ్డనైన నన్ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని. చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్..కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ విఏఎస్ ఫంక్షన్ హాల్లో దివ్యాంగుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రవిశంకర్ మాట్లాడుతూ…. దివ్యాంగుల సంక్షేమమే పరమావధి. దివ్యాంగులకు దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక పెన్షన్ 4016 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉంది. అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉంది. మేనిఫెస్టో, అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటు వెయ్యండిని రవిశంకర్ పేర్కొన్నారు.
Read Also..
‘‘బిడ్డా… మాకోసం పోరాడుతున్నం. ధర్మం కోసం యుద్దం చేస్తున్నవ్. నువ్వు నిండు నూరేళ్లు సల్లగుండాలే. మా ఇంటి ఓట్లే కాదు… ఈ వాడల ఉన్న ఓట్లన్నీ పువ్వు గుర్తుకే వేయిస్తా.’’ బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ను ఉద్దేశించి రాజేశ్వరి అనే 65 ఏళ్లు వ్రుద్దురాలు అన్న మాటలివి. ‘‘బిడ్డా… మా పేదోళ్ల కోసం పాదయాత్ర చేసి అండగా ఉన్నవ్. మా కోసం కొట్లాడి జైలుకు పోయినవ్. నువ్వు యుద్ద వీరుడివి. నీకు కాకుండా ఇంకెవరికి ఓట్లేస్తం బిడ్డా… ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు సల్లగుండాలే. మా కోసం కొట్లాడతనే ఉండాలే’’ అంటూ సుశీల అనే 70 ఏళ్లు వ్రుద్ధురాలు బండి సంజయ్ కు వీర తిలకం దిద్ది శీస్సులిచ్చారు. వీళ్లే కాదు…. తొలిరోజు కరీంనగర్ లోని 24, 25 డివిజన్లలోని అంబేద్కర్ నగర్, కిసాన్ నగర్ లలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ను కలిసిన ప్రతి ఒక్కరి నోటి నుండి ఇవే మాటలు వెలువడుతున్నయ్. ప్రతి ఒక్కరూ ఎదురొచ్చి ఈసారి పువ్వు గుర్తుకే మా ఓటు అంటూ నినదిస్తున్నారు. తొలిరోజు పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్ వెళ్లిన ప్రతిచోట బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. పూలు చల్లి కొందరు, వీర తిలకం దిద్ది మరికొందరు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘‘సంజయ్… నువ్వు ఎవరికీ తలొంచకు. మీ వెంట మేమున్నాం.’’ భరోసా ఇస్తున్నారు.
నిరుద్యోగ తమ్ముళ్లారా…… కేసీఆర్ రాక్షస పాలనలో మీరు పడ్డ గోసలు ఈ 23 రోజులు గుర్తుచేసుకోండి. మీ కుటుంబాలు పడుతున్న బాధలను యాది చేసుకోండి. 9 ఏళ్లుగా ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా జాబ్ క్యాలెండర్ అంటూ మభ్యపెడుతున్న దండుపాళ్యం ముఠా మాటలు నమ్మకండి. అట్లాగే మీకోసం యుద్దం చేసిన బీజేపీని గుర్తుంచుకోండి. రాబోయే ఎన్నికల్లో మీరిచ్చే తీర్పుతో బీఆర్ఎస్ నేతల మైండ్ బ్లాంక్ కావాలె…. అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ యువకులకు పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట మేరకు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. వయోపరిమితిని సడలించి నిరుద్యోగులకు జరిగిన నష్టాన్ని పూడుస్తామన్నారు. బీసీ నాయకుడే సీఎం అవుతారని ఉద్ఘాటించారు. కేసీఆర్ కు దమ్ముంటే… ఆయన రాజకీయ వారసుడెవరో ఎన్నికల తరువాత ఎవరిని సీఎం చేస్తారో ప్రకటించాలని సవాల్ విసిరారు.
నిన్నటి ర్యాలీ ఒక చరిత్ర సృష్టించినది.స్వచ్ఛందంగా తరలివచ్చారు. 30 తేదిన విజయానికి సంకేతం. రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ లో బిజేపి గెలుస్తదని డిసైడ్ చేసాడు. బండిసంజయ్ భూదందాలు చేయలేదు. ఖబ్జాలు చేయలేదు. కరీంనగర్ అభివృద్ధి కి నిధులు తిసుకువచ్చింది ఎవరు, అభివృద్ధి అడ్డం పడ్డది ఎవరూ బండిసంజయ్ ని అసెంబ్లీ లో అడుగు పెట్టవద్దంటూ వేల కొట్లు కరీంనగర్ కి పంపుతున్నారు. కరీంనగర్ బండిసంజయ్ మీద ఎవరూ పోటి చెయడానికి ముందుకు రాకపోతే గుడ్డిలో మెల్లలాగా గంగులకి టికెట్ ఇచ్చారు. కెటిఆర్ ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే కుక్కలు కుడా దేకవు. కెటిఆర్ వి అహంకారం అహంకారం మాటలు. బిఆర్ఎస్ గెలిస్తే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తానని ఇప్పుడు ఇస్తానంటున్నారు. టిఎస్ పిఎస్సి సమస్య చిన్నది అని కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తరువాత నిరుద్యోగుల అశలు అడియాశలు అయినవి. నిరుద్యోగ సమస్యల కొసం బిజేపి పొరాటం చేస్తే జైలుకు పంపారు రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సంవత్సరం లో మోడి పది లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. యాభై లక్షల మంది నిరుద్యోగ యువత కదలి వచ్చి బిఆర్ఎస్ పార్టీని ఒడగొట్టడానికి చెతులు కలపాలి. నరేంద్ర మోడి బిసి అత్మగౌరవ సభకి వస్తున్నారు, బిసి వర్గానికి చెందిన వ్యక్తి ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాం. కెసిఆర్ కి బిసి ముఖ్యమంత్రి ని చెస్తానని చెప్పె దమ్ము ధైర్యం ఉందా? గతంలో చెప్పినట్లు ఎస్సిని ముఖ్యమంత్రిగా చేస్తావా. బంగారు తెలంగాణ అని బర్బాజ్ చేసాడు. కెసిఆర్ కుటుంబం అహంకారానికి, తెలంగాణ ప్రజలకి జరుగుతున్న పోరాటం. కెసిఆర్ రాజ్యాంగం కావాలా… అంబేద్కర్ రాజ్యాంగం కావాలా తెలంగాణ రాష్ట్రం లో దొంగలంతా బిఆర్ఎస్ లో చేరినారు. ఒకసారి బిజేపి పార్టీకి అవకాశం ఇవ్వండి. ప్రశ్నించే గొంతుని అణచివెయకండి….గెలిపించండి.
బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కరీంనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి సంజయ్ పాల్గొన్నారు. ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడితే నాపై 30 దొంగ కేసులు పెట్టారన్నారు. మతతత్వవాది అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారన్నారు. ధర్మం కోసం పోరాడేది భాజపా. రాజాసింగ్, నేను.. ధర్మం కోసం పోరాడేవాళ్లం. మేం ఎప్పుడూ కాషాయజెండాను వదిలిపెట్టలేదు. ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాక పార్టీని పరుగులెత్తించానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజాసంగ్రామ యాత్ర చేసి కాషాయ జెండాను తెలంగాణ అంతటా రెపరెపలాడించానన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని వైన్స్, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్శాఖ యజమానులను అప్రమత్తం చేసింది.ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో ఈసీ ఆదేశాలను పాటించాలని సూచించింది. లేనిపక్షంలో లైసెన్స్లు రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా తాను చేసిన పోరాటాలు, కేంద్రం నుండి తీసుకొచ్చిన ప్రస్తావిస్తూ రూపొందించిన కరపత్రం ప్రజలను ఆకర్షిస్తోంది. ‘‘నేనెప్పుడూ మీ బిడ్డనే… నిండు మనసుతో దీవించండి’’ పేరుతో రూపొందించిన 2 పేజీల కరపత్రాలను బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ‘‘నేనెప్పుడూ మీ బిడ్డను… మీ కళ్ల ముందు పెరిగిన. మీ కాళ్ల మధ్యన తిరిగిన. మీ దీవెనలతోనే ఇంతటి వాడినయ్యా. కరీంనగర్ గల్లీలో తిరిగిన సామాన్యుడిని దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశాన్ని కల్పించారు. పోరాటాల, చైతన్యాల కరీంనగర్ గడ్డపై పుట్టిన బిడ్డగా దేశం కోసం, ధర్మం కోసం కాషాయ జెండా పట్టుకుని ప్రజల పక్షాన పోరాడిన’’ అంటూ కరపత్రాన్ని రూపొందించారు. అంతేగాకుండా ఎంపీగా గెలిపించాక కరీంనగర్ అభివ్రుద్ధి కోసం చేసిన కార్యక్రమాలు, తెచ్చిన నిధులతోపాటు తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజల పక్షాన చేసిన పోరాటాలను, జైలుకు వెళ్లిన సందర్భాలను కరపత్రంలో ప్రస్తావించారు. కరపత్రంపై ప్రజల్లో సానకూల చర్చ జరుగుతోంది
బహుజన్ సమాజ్ పార్టీ సుల్తానాబాద్ మండలo గర్రేపల్లి గ్రామం నుండి అంతడుపుల రాజేశ్వరి, దుబ్బాసి లక్ష్మి, జెట్టీ ప్రేమలత,అంతడుపుల శారద, 200 మందికి పైగా పార్టీలో చేరగా వారికి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ…. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళలను ఓటర్ల గానే చూశారే తప్ప స్వయంఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే మహిళలకు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.విధంగా మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎన్నికలవేళ టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోవద్దు అన్నారు.
Read Also..
పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. పెద్దపల్లి నియోజకవర్గం లో ఆర్వో కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియకు అన్ని సిద్దం చేశారు.ఆర్వో కార్యాలయాల వద్ద నామినేషన్ దాఖలు చెయ్యడం కోసం సందేహాలను నివృత్తి చెయ్యడం కోసం ఆయా కేంద్రాలలో హెల్ప్ డెస్క్ లకు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్వో కార్యాలయాల పరిసర ప్రాంతాలలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ పటిష్ట బందోబస్తు ను ఏర్పాటు చేశారు. కేంద్రాల చుట్టూ వంద మీటర్ల దూరం లో మార్క్ చేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి ఆర్వో కార్యాలయానికి బందోబస్తుని ఏర్పాట్లును పెద్దపల్లి డిసిపి Dr.చేతన మరియు ఎసిపి ఎడ్ల మహేష్ పరిశీలించారు.






Total views : 194824