గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ జనవరిలో హ్యాక్ అవగా రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ ఖాతా హ్యాక్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ముంబై నుంచి గవర్నర్ ఖాతా హ్యాక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఓ బొటిక్ వైఫైని దుండగుడు వినియోగించినట్లు తేల్చారు. బొటిక్ నిర్వాహకురాలిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. అయితే బొటిక్ షాప్ కొన్ని రోజులుగా మూసిఉన్నట్లు తెలిసింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్కరాలకు హాజరు కావాల్సిందిగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో…
గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. అడవుల్లో లభించే ఈ ఆకులను సేకరించి గిరిజనులు ఆదాయం పొందుతారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో తునికాకు విస్తృతంగా లభిస్తుంది. బీడీలు తయారు చేయడానికి…
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…