ఇజ్రాయిల్(Israel)లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హెజ్బుల్లా దక్షిణ లెబనాన్ నుంచి దాదాపు 160 రాకెట్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య ఘర్షణ ప్రారంభమైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా, తమ కీలక కమాండర్ తలెబ్ సమీ అబ్దుల్లా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్కు చెందిన రెండు మిలిటరీ బేస్లపై రాకెట్లు, మిస్సైళ్లతో దాడి చేశామని హెజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికాతో సహా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న వేళ హెజ్బుల్లా ఈ దాడికి పాల్పడటంతో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఇప్పటివరకు లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 400 మంది హెజ్బుల్లా సభ్యులు మరణించారని అధికార వర్గాలు తెలిపాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- CVR NEWS LIVEAdvertisements
- కడప లో వైసీపీకి షాక్టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు… పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్.. వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు… చక్రాయపేట,వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు…
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.