228
మధ్యప్రదేశ్లో తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో తెలంగాణ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారన్న ప్రచారాన్ని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఖండించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ మూడో రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునేందుకు ఫౌల్ గేమ్కు పాల్పడిందని ఆరోపించారు.రిటర్నింగ్ అధికారి, ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాయని ఆరోపించిన ఆమె.. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, కేవలం నోటీసు మాత్రమే వచ్చిందన్నారు. ప్రీ-కాగ్నిజెన్స్ దశలో ఉన్న కేసును ఫామ్-26లో పేర్కొనాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు చెప్పారని వివరించారు.