రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ఘట్కేసర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. శివారెడ్డిగూడ హనుమాన్ ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అరెస్టును వారు తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తోందని ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అణచివేయడం తగదని, ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీపై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రాహుల్ గాంధీ అరెస్టుపై కాంగ్రెస్ నిరసన.
59
previous post