నరసరావుపేట లో విషాదం నెలకొంది. స్థానిక NEC కాలేజీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న రేచల్ రెడ్డి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుందని కాలేజి యాజమాన్యం తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్నినరసరావుపేట ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.