పల్నాడు జిల్లా, నరసరావుపేట పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతల ధర్నా చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వరికెపుడిసెలని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, పలువురు టీడీపీ శ్రేణులుతో పాటు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
Narasa Raopet
నరసరావుపేట లో విషాదం నెలకొంది. స్థానిక NEC కాలేజీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న రేచల్ రెడ్డి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుందని కాలేజి యాజమాన్యం తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్నినరసరావుపేట ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..
Read Also..
పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాది ఏప్రిల్ లో నడికుడి రైల్వే స్టేషన్ లో మహిళపై దాడి చేసి రేప్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఓప్పిచ్చెర్లకి చెందిన సుబ్బారావు, గురజాలకి చెందిన మాదిరాజు ప్రసాద్ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర లోని తన అత్త గారి ఇంటి నుండి మధ్యప్రదేశ్ ఈస్ట్ నిమార్ జిల్లాలోని తన పుట్టింటికి వెళుతూ దారి తప్పి నడికుడి రైల్వే స్టేషన్ లో దిగిన మహిళపై నిందుతులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.





Total views : 141328