Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Latest News వివేకంతో ఓటు వెయ్యాలి….

వివేకంతో ఓటు వెయ్యాలి….

by Prakash
kcr meeting at sangareddy

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారలోకి వస్తే.. తొలి మంత్రి వర్గ సమావేశంలో అసైన్డ్ భూముల పట్టాలపై సంతకం చేస్తానని గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా రైతు బంధు రూ. 16 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.1956 లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, అప్పుడు రాష్ట్రాన్ని ఆంధ్రలో కలపటం వల్ల 50 ఏళ్లు ఎన్నో గోసలు పడ్డామని గుర్తుచేశారు. గులాబీ జెండా పట్టి అందరం పోరాడితే 2004లో తెలంగాణ ప్రకటించారని, అప్పుడు ప్రకటించినా తెలంగాణను 2014 వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. తాను ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నాకనే కాంగ్రెస్ పార్టీ దిగివచ్చిందని గుర్తుచేశారు. మరోవైపు ధరణి పోర్టల్‌లో రైతుల వేలిముద్ర లేకుండా భూ రికార్డులను సీఎం కూడా మార్చలేరని, ధరణితో రైతుల భూములు నిశ్చింతగా ఉన్నాయని చెప్పారు.

Advertisements

You may also like

Our Visitor

014716
Total views : 80931

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.