Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News నాగార్జునసాగర్ జలాశయంలో నీటి కుక్కల స్వైర విహారం…

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి కుక్కల స్వైర విహారం…

by Prakash
Water dog excursion in Nagarjunasagar reservoir

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయాల్లో కలియదిరుగుతూ నీటి కుక్కలు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. శివాలయం పుష్కర ఘాట్ వద్ద దర్శనమిచ్చాయి కనుమరుగైపోతున్న జాతుల్లో నీటికుక్కలు కూడా ఒకటి అటు భూమి మీద ఇటు నీటిలో ఉండ గలిగే ఉభయ చరాల్లో నీటికుక్కలు కూడా ఒకటి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నీటికుక్కల ఉనికిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇటీవలే తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి కుక్కలు దర్శనమిచ్చాయి చేపల్ని ఆహారంగా తీసుకుని నీటికుక్కలు జీవనం సాగిస్తుంటాయి. రెండేళ్ళ క్రితం ఒకసారి సాగర్ జలాల్లో నీటికుక్కలను గుర్తించారు. అయితే ఆ తరువాత కాలంలో అవి కనిపించకుండా పోయాయి. తాజాగా సాగర్ జలాల్లో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలోనే నీటి కుక్కలు జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వీటి సంతతి పెరుగుతున్నట్లు స్పష్టమౌతుంది అంతరించి పోతున్న అరుదైన జాతి కావటంతో వీటిని సంరక్షించాలని పర్యాటకులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: