మరో నాలుగు నెలల్లో రామకృష్ణాపూర్ క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు అందుబాటులోకి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి..పనులను వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి.మరో నాలుగు నెలల్లో క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం బ్రిడ్జి పనులను పరిశీలించి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.అలాగే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుర్మపల్లి గ్రామంలో పర్యటించి చేయాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 సంవత్సరంలో ఎంపీ గా ఉన్న సమయంలో రైల్వే గేటు వలన జరుగుతున్న మరణాలను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చానని, రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి నిర్మించి దాదాపుగా పదేళ్లు గడుస్తున్న రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్ఓబి పనులు గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. ఆర్ఓబి పనులకు సంబంధించి అంతరాయాలను పూర్తిగా తొలగించామని దసరా లోపు రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు రాకపోకలను అందుబాటులోకి తెస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పనుల్లో అలసత్వం చేస్తే సహించేది లేదని అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్మెన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి,రఘునాథ్ రెడ్డి, పల్లే రాజు, అబ్దుల్ అజీజ్, నాయకులు ఉన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును పూర్తిగా అధిగమించి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ అంతటా జింబాబ్వే జట్టు భారత్కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత్…
- మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి.…
- రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు. అయితే, ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉంటానని…
- నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్ అధికారుల సస్పెన్షన్.నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్లో అధికారుల చేతివాటం తీవ్ర కలకలం రేపింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలాది రూపాయల విలువైన టేకు కలపను ప్రభుత్వ డిపోకు తరలించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నించిన ఘటనా స్థానికంగా చర్చనీయాంశంగా…
- సీబీఎస్ఈ, నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ.సీబీఎస్ఈ, నీట్ వంటి కీలక జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షం, ముఖ్యంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.