332
టికెట్ రాని అసంతృప్తుల నిరసనలతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టికెట్ రాకపోవడంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు. గాంధీభవన్ ముందు బైఠాయించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విష్ణు అనుచరులు గాంధీభవన్పైకి రాళ్లు కూడా విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు..భద్రతను కట్టు దిట్టం చేశారు.




Total views : 61775