గురువారం రోజు ఉదయం రాయచోటి బస్టాండ్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రభుత్వం కొనుగోలు చేసిన నూతన బస్సులను ప్రారంభించారు అనంతరం విలేకరుల ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులు ఆక్రమించుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేశారన్నారు. కాబోయే కాలంలో ఆర్టీసీని ప్రక్షాళన గావించి ప్రయాణికులకు నాణ్యమైన సేవల అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే కాలంలో మరిన్ని నూతన బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.అన్నమయ్య జిల్లా మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లిఅన్నమయ్య జిల్లాలను మారుస్తున్నారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఎట్టి పరిస్థితుల్లో జిల్లా మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఊరు పేర్లు, సంస్థల పేర్లు మార్చే ప్రభుత్వం మాది కాదని మాది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వము అని పేర్కొన్నారు… రాబోయే కాలంలో రాయచోటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు…
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
- సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…
- భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…
- ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో…
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.