ప్రజలను నిత్యం చైతన్యం చేస్తూ యువతకు మార్గదర్శకాలు సూచిస్తూ అనేక అవగాహన కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో పట్టణంలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు అధికారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జూనియర్ కళాశాల మైదానంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన అనంతరం స్థానిక అంబేద్కర్ చౌక్, నేతన్న చౌక్, గాంధీ చౌక్ మీదుగా ర్యాలీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాలీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని, డ్రగ్స్,గంజాయి మత్తు పదార్థాలకు బానిస అయిన వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఒక డ్రగ్స్ మేళ ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని, డ్రగ్స్ కు బానిస ఐనవారు వారు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ బారిన పడకుండా పోలీసులు అండగా ఉండి కాపాడతారని ఎస్పీ తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 91096