Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Latest News రైతులను చులకనగా చూస్తే – ఓటు అడిగే హక్కులేదు

రైతులను చులకనగా చూస్తే – ఓటు అడిగే హక్కులేదు

by Satya
Naga Jyoti

ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మలను దర్శించకున్నారు. పార్టీ జిల్దా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు తో కాలిసి వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివాసి సాంప్రదాయాలతో గిరిజన పూజారులు ఘన స్వాగతం పలికారు. వనదేవతల దర్శనం అనంతరం మేడారం, ఊరటం, రెడ్డిగూడెం, వెంగలాపూర్, కొత్తూరు, నార్లాపూర్, బయ్యక్కపేట గ్రామాలలో నాగజ్యోతి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వారిని కాంగ్రెస్ గుండాలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. సమ్మక్క సారక్క పోరాటాల గడ్డని,కాంగ్రెస్ బెదిరింపులకు లొంగేది లేదన్నారు. రైతులను చులకనగా చూసే కాంగ్రెస్ నేతలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014837
Total views : 81121

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.