Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News 70రూ గడియారం కావాలా – ఆత్మగౌరవం కావాలా..?

70రూ గడియారం కావాలా – ఆత్మగౌరవం కావాలా..?

by Satya
KCR

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధరణి, దళిత బంధు, రైతు బంధు వద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. నాలుగు పైసలు ఉన్నంత మాత్రానా ఇంత అహంకారమా అంటూ ప్రశ్నించారు. అదే విధంగా కేంద్రంపై ధ్వజమెత్తారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తడి తీసుకొచ్చిందని.. చచ్చినా ఆ పని చేయనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక సత్తుపల్లిలో 70వేల మెజార్టీతో సండ్ర గెలుపు ఖాయమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలవనీయమని కొంతమంది మాట్లడుతున్నారని.. గడియారాలు, డబ్బులు పంచడం రాజకీయామా అంటూ ప్రశ్నించారు. 70రూపాయల గడియారం కావాలో ఆత్మగౌరవం కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. దళితుల శ్రేయస్సు కోసం బీఆరెస్ తప్ప ఎవరూ ఆలోచించరని వ్యాఖ్యానించారు.

Advertisements

You may also like

Our Visitor

039167
Total views : 194539

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: