Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home International పాలస్తీనాకు భారత్ రెండో విడత మానవతా సాయం

పాలస్తీనాకు భారత్ రెండో విడత మానవతా సాయం

by Satya
India's second tranche

ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా ప్రజలను ఆదుకునేందుకు భారత్ మానవతా సాయం అందిస్తుంది. గత నెలలో మొదటి విడతలో భాగంగా 6.5 టన్నుల సామాగ్రిని పంపిన భారత్, తాజాగా రెండో విడత సాయాన్ని పంపింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. తాము పాలస్తీనా ప్రజలకు మానవతా సాయాన్ని అందిస్తూనే ఉంటామని ఎక్స్ లో ట్వీట్ చేశారు. భారత వైమానిక దళానికి చెందిన రెండవ సీ17 విమానం 32 టన్నుల సాయంతో ఈజిప్ట్ కి బయలుదేరిందని పోస్ట్ చేశారు. ఈ సామాగ్రిని మొదట ఈజిప్టులోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి చేరుస్తారు. అక్కడి నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు తీసుకెళ్తారు. ప్రస్తుతం గాజాలోకి మానవతా సాయం కోసం రఫా మాత్రమే క్రాయింగ్ పాయింట్ గా ఉంది. అయితే గాజాలో రహదారులన్నీ తీవ్రంగా ధ్వంసం కావడంతో వివిధ దేశాలు పంపించే మానవతా సాయం అందించే ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగడంలేదు.

Advertisements

You may also like

Our Visitor

014736
Total views : 80971

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.