Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News గెలుపుపై ధీమా – చలమల్ల కృష్ణా రెడ్డి..

గెలుపుపై ధీమా – చలమల్ల కృష్ణా రెడ్డి..

by Prakash
Chalamalla Krishna Reddy

ఈ ప్రాంత బిడ్డ గా నాకు ఒక్కసారి అవకాశమిస్తే ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాననన్నారు బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణా రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి, తాస్కాన్ గూడెం, శిరిదేపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. కోలాటాలతో ఘన స్వాగతం పలికారు మహిళలు బిజెపి శ్రేణులు. ఈ సందర్భంగా చలమల్ల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ. రాజగోపాల్ రెడ్డి లాగా నేను కాంట్రాక్ట్ ల కోసం రాజకీయాలు చేయడం లేదన్నారు, ఎమ్మెల్యేగా ,ఎమ్మెల్సీగా ఉండి. ఈ ప్రాంతానికి ఆయన చేసిన అభివృద్ధిని ఏమి లేదనీ, ఆయన్ని గెలిపిస్తే మళ్ళీ మనకు దొరకడని అన్నారు. కూసుకుంట్ల ఒక అసమర్ధ ఎమ్మెల్యే అని, ఆయనకు మాట్లాడే ధైర్యం లేదని, ఆయన సేవలిక చాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీని ప్రజలు విస్మరించారని ఈ నెల జరిగే 30న ఎన్నికల్లో బిజెపి పార్టీ 20,000 మెజార్టీతో కషాయం జండా ఎగర పోతుందన్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు, పేద ప్రజలకు రేషన్ కార్డ్స్, పెన్షన్స్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేదకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇప్పిస్తామన్నారు. మునుగోడు గడ్డమీద కాషాయం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: