Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Devotional మీనాక్షి అమ్మవారి ఆలయం

మీనాక్షి అమ్మవారి ఆలయం

by Satya
Goddess Meenakshi Temple

మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం చెన్నై నుండి సుమారు 400 కి.మీ ల దూరంలో వుంది. తమిళనాడులోని మదురై పట్టణం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మీనాక్షి దేవాలయం. మీనాక్షి దేవాలయం మదురై లో కల వేగాయి నది ఒడ్డున కలదు. మదురై పట్టణం తమిళనాడులో రెండవ పెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్ర సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలు మొదలైనవాటికి నిలయంగా వుంటుంది. ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన మదురై అనేక రాజ వంశాల పాలనలు చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతో మంది ఈ నగరాన్ని అభివృద్ధి పరచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు తమ తమ కళాభిరుచులకు తగినట్లు నిర్మించారు. ఈ పట్టణం అనేక చారిత్రక కధలు కలిగి ఎంతో ప్రాధాన్య సంతరించుకొన్నది. భారత దేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలలో ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటి. ఇంతటి గొప్పదైన మదురై పట్టణం లోని కొన్నిపర్యాటక ఆకర్షణలు పరిశీలించండి.అలగిర్ కోవిల్ అలగిర్ కోవిల్ అనే ఈ దేవాలయం నగరానికి సుమారు 20 కి. మీ. ల దూరంలో కలదు. మదురై లో తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి. ఎత్తైన గోపురాలు అనేక ప్రేమ మరియు మానవతల దృశ్యాల శిల్పాలు కలిగి ఆకర్షణీయంగా వుంటాయి. కళలకు సంస్కృతికి ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ టెంపుల్ యొక్క ప్రధాన గోపురం ఎల్లపుడూ మూసి వుంచి, సంవత్సరానికి ఒక సారి తెరుస్తారు. ప్రవేశ ద్వారాన్ని మాత్రమే భక్తులు పూజిస్తారు. మీనాక్షి దేవత అసలు ఎవరు ? మీనాక్షి మాత, రాజు మలయద్వాజ పాండ్య కుమార్తె. ఆమె ఒక యజ్ఞం చేయగా అగ్ని నుండి ఆవిర్భవించినది. ఆమె పుట్టినప్పుడు మూడు స్థనాలు కలిగి వుందని, అందుకు రాజు చిన్తిన్చ గా ఆమెకు వివాహం అయిన వెంటనే, మూడవ స్థనము మాయం అవుతుందని ఆకాశవాణి పేర్కొని, ఆమెను ఒక యువ రాణి వలే కాక, ఒక రాజ కుమారుడిగా పెంచవలసినది గా కోరింది. ఆ రకంగా మాత మీనాక్షి యుద్ధ విద్యలు నేర్ప బడి పట్టాభిషేకం చేయబడి రాజ్యం అప్పగించబడినది. ఆమె అనేక యద్ధాలు గెలిచింది. చివరకు శివుడితో యుద్ధానికి సనద్ధమై, యుద్ధ భూమిలో ఆయనే తన భర్తగా గుర్తించినది. ఎత్తైన గోపురాలు ఈ టెంపుల్ గురించి పురాతన తమిళ సాహిత్యంలో కూడా పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత టెంపుల్ మాత్రం క్రీ. శ. 1623 – 1655 ల మధ్య నిర్మించబడి నట్లు చరిత్ర చెపుతోంది. ఈ దేవాలయానికి 14 గోపురాలు కలవు. ఇవి సుమారుగా 45 – 50 మీటర్ల ఎత్తులో వుంటాయి. ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారు ఈ దేవాలయంలో ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారు. ఈమెను పార్వతి అవతారంగాను ఈమె సహచరుడైన సుందరేస్వరుడిని శివుడిగాను కొలుస్తారు. సుమారు 2,500 సంవత్సరాల కిందటిదిగా చెప్పబడే మదురై పట్టణానికి ఈ దేవాలయం ప్రధానమైనది.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014721
Total views : 80945

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.