తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వేదనారాయణ స్వామిని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. సిఐ శివ కుమార్ రెడ్డి, ఎస్ఐ ఓబయ్య, ఆలయ అర్చకులు ఎస్పీకి స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు పలికారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.