Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh నవరత్నాలు పై సవాల్…..

నవరత్నాలు పై సవాల్…..

by Prakash
Ganta Srinivas

ఈ రోజు పుట్టిన రోజు సందర్బంగా శ్రీకాళహస్తేశ్వరుడిని దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు గంటా శ్రీనివాసులు వారికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి దర్శన అనంతరం వారు ఊరందూరు లో సుధీర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన విందు లో పాల్గొని కేక్ కట్ చేసారు. పత్రిక సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు ఆలోచన ని ప్రజలకు వివరించారు. గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాలుగున్నర సంవత్సరం అభివృద్ధి చేయకుండా మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అనగా ఉత్తరాంధ్రలో రాజధాని అని లేనిపోని అపోహలు కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు, ఋషికొండ కి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకపోయినా కూడా అందులో కట్టడాలు నిర్మిస్తూ ప్రజా ఆస్తిని ధ్వంసం చేస్తున్న ఈ వైసిపి ప్రభుత్వం త్వరలోనే ఇంటికి పోవడం ఖాయమని ధ్వజమెత్తారు, రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ని ద్వంసం చేయడానికి చూస్తున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గోపాల కృష్ణారెడ్డి గారితో కలిసి గంటా శ్రీనివాసరావు విద్యాసంస్థలకు అభివృద్ధి పథంలో నడపడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా గంటా శ్రీనివాసరావు సహకారం తో శ్రీకాళహస్తిలో మరింత అభివృద్ధి పథంలో నడపటానికి కృషి చేస్తానని, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కాయమని ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారి పనిచేయడం చూస్తుంటే నారా చంద్రబాబునాయుడు తిరుమలకు రావడంతో వారు బస చేస్తున్న అతిథి గృహం వద్ద నేను వెళ్తే అక్కడున్న సిఐ, డిఎస్పి విచక్షణరహితంగా మాట్లాడుతూ ఒక ప్రజా ప్రతినిధి అని కూడా లేకుండా ఏకవచనంతో సంబోధించడం దారుణమని వారిపై ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ ఇస్తానని తెలిపిన కంచర్ల శ్రీకాంత్.

Advertisements

You may also like

Our Visitor

014783
Total views : 81029

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.