Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshChittoor మనస్థాపానికి గురై నిషా ఆత్మహత్య..

మనస్థాపానికి గురై నిషా ఆత్మహత్య..

by Rama
murder

తిరుపతి జిల్లా నాగలాపురం దళితవాడకు చెందిన నిషా 23సం”మూడు రోజుల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యాకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మూడు రోజుల క్రితం నిషా భర్త శర్మ అక్రమ సంబంధం ఉందని నిలదీస్తూ ఆక్రోసంగా నిషా పై దాడి చేశాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. నిషా తల్లిదండ్రులు, బంధువులు మా కూతురుపై ఎందుకు దాడి చేశావు అని అడగగా, వారి పైన కూడా దాడి చేసినట్లు తెలిపారు. మనస్థాపానికి గురైన నిషా ఆత్మహత్యకు పాల్పడి నగిరి, తిరుపతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. నిషా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి దర్శిత అనే ఒకటిన్నర సంవత్సరాల చిన్న పాప ఉన్నట్లు సమాచారం. సంబంధిత విషయంపై నాగలాపురం ఎస్ఐ ఓబయ్య వివరణ కోరగా పై విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014010
Total views : 78808

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.