కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని పెద్దపెల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చింతకుంట విజయ రమణ రావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రాజీవ్ గాంధీ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా బీపీల్ కుటుంబాలకు రూ. 10 లక్షల వరకు ఆరోగ్య భీమాను కల్పించే కార్యక్రమాన్ని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ రమణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అనేది పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ అన్ని ఆరోగ్య కార్యక్రమాల యొక్క ప్రధాన పథకం తెలంగాణలో “అందరికీ ఆరోగ్యం” సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తామని అన్నారు. మరియు 126 రకాల చికిత్సలకు ఒక సంవత్సరం కాలం ఉచితంగా మందులు అందిస్తామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం నిరుపేద కుటుంబాలకు చికిత్స కోసం సంవత్సరానికి రూ. 10 లక్షల వరకు ఆర్థిక రక్షణను అందిస్తామని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేస్తామని విజయరమణ రావు గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్,పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిటెండెంట్ డా.రమాకాంత్, పెద్దపల్లి తహశీల్దార్ రాజ్ కుమార్, పెద్దపల్లి జెడ్పీటీసీ బండారి రాంమూర్తి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, డాక్టర్లు, ఎఎన్ఎంలు, ఆషావర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ ఆరోగ్యం – ఎమ్మెల్యే విజయ రమణ రావు..
325
previous post






Total views : 149338