Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh నాదెండ్ల మనోహర్ ను విడుదల చేయాలంటూ ధర్నా..

నాదెండ్ల మనోహర్ ను విడుదల చేయాలంటూ ధర్నా..

by
nadendla manohar arrest

తమ అథినేత నాదెండ్ల మనోహర్ ను విశాఖపట్నం టైకూన్ సెంటర్లో వైజాగ్ పోలీసులు నిర్భందించినందుకు తెనాలిలో జనసైనికులు, వీరనారీమణులు, తెదేపా సభ్యులు ఆందోళనకూ దిగి మార్కెట్ సెంటర్లో రాస్తారోకో చేసి థర్నాకు దిగారు. తర్వాత జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను వదలివేయటం జరిగింది. ఏమిటీ విశాఖ టైకూన్ సెంటర్ వివాదం ? విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ నుండి విఐపి రోడ్డుకు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేసారు. నాలుగు నెలల క్రితమే టైకూన్ సెంటర్ వద్ద రోడ్డును మూసేసారు. అయితే ఇలా హటాత్తుగా ప్రజలు ఉపయోగించే రోడ్డును మూసేయాడానికి, ఇదే రోడ్డులో నిర్మిస్తున్న వైసిపి ఎంపి ఎంవివి సత్యనారాయణకి భవనమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ భవనానికి వాస్తు దోషం వుందని ఏకంగా రోడ్డునే మూసేసారని ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల ఆస్తులను అధికారులు ప్రజలు ఉపయోగించే రోడ్డును మూసేయడం దారుణమని జనసేన నాయకులు అంటున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: