Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh వివాహ రిసెప్షన్ కు హాజరైన జగన్మోహన్ రెడ్డి….

వివాహ రిసెప్షన్ కు హాజరైన జగన్మోహన్ రెడ్డి….

by Prakash
Jagan Mohan Reddy attended the wedding reception.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి నగరంలో తాజ్ హోటల్ లో జరిగిన శ్రీ సిటి ఎండి రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు బుధవారం సాయంత్రం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి స్థానిక తాజ్ హోటల్ నందు జరిగిన శ్రీ సిటి ఎండి రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరై వధువు నిరీష, వరుడు సాగర్ లకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించి 5.15 గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు పయణమయ్యారు. రేణిగుంట విమానాశ్రయం నందు ముఖ్యమంత్రి కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కళత్తూరు నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కె రోజా, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం , చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్, చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, డి ఐ జి అమ్మి రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే మరియు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీవో రవిశంకర్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం, వీడ్కోలు పలికారు.

Advertisements

You may also like

Our Visitor

014143
Total views : 79167

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.