తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఆయనతో రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగానూ అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన తన వంతు పాత్ర పోషిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమానికి పిలవగానే వచ్చి కార్మికుల సమస్యలను స్వయంగా విని కృషి చేసింనందుకు ధన్యవాదాలు, అలాగే అభినందనలు తెలిపారు. అందరి సభ అయినా శాశనసభలో అందరి హక్కులను కాపాడే బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానన్నారు.